రాణా బ్రదర్ పై పోలీస్ కంప్లెయింట్

Update: 2015-11-29 19:03 GMT
దగ్గుబాటి రాణా సోదరుడిపై పోలీస్ కంప్లెయింట్ నమోదైంది. నడి రోడ్డుపై మొదలైన గొడవ.. చివరకు పోలీస్ స్టేషన్ కి చేరినట్లు తెలుస్తోంది. తన కారుకు డ్యాష్ ఇచ్చాడన్న కోపంతో..  బైకర్స్ మీద అటాక్ చేశాడన్నది కంప్లెయింట్ సారాంశం.

రాణా  బ్రదర్ అభిరామ్ జూబిలీహిల్స్ రోడ్ పై తన కారులో వెళ్తుండగా.. ఓ బైక్ వ్యక్తి స్పీడ్ గా వచ్చి కారుకి ముందు భాగంలో డ్యాష్ ఇచ్చాడట. అయితే.. తన పొరపాటుకు కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్లిపోవడంతో.. ఛేజ్ చేసి బైక్ ని ఆపి మరీ గొడవ పడ్డాడట అభిరామ్. ఈ గొడవ కాస్త ముదిరి.. దాడి చేసుకునేవరకూ వెళ్లింది. దీంతో ఇద్దరు ఒకరిపై ఒకరు పోలీస్ కంప్లెయింట్స్ చేసుకున్నారు.

అభిరామ్ తమపై శారీరకంగా అటాక్ చేశాడంటూ.. బైకర్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకుని.. అసలు జరిగింది ఏమిటో తెలుసుకునే ప్రయత్నం ప్రారంభించారు. ఇందుకోసం సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. ఎవరు ముందు గొడవ ప్రారంభించారో, ఎవరు ముందుగా దాడి చేశారో పరిశీలించి, యాక్షన్ తీసుకోవాలని భావిస్తున్నారు పోలీసులు.

Tags:    

Similar News