పవన్-మరార్.. అసలేమైంది స్నేహానికి?

Update: 2017-08-17 06:31 GMT
స్టార్ హీరోలే మన తెలుగు ఇండస్ట్రి ని నడిపిస్తున్న విషయం అందరికీ తెలిసిన మన స్టార్లు నిర్మాతలకు మంచి గౌరవం ఇస్తారు. అలాగే కొంతమంది నిర్మాతలుతో మన స్టార్స్ కి మంచి స్నేహం కూడా ఉంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ విషయంలో అందరి కంటే ఒక అడుగు ముందుంటాడు అనే చెప్పాలి. నిజానికి దగ్గరగా మాట్లాడటం మనసుకు నచ్చిన మనుషులు తోనే కలవడం లాంటి విషయాలలో పవన్ కల్యాణ్ కు మంచి పేరు ఉంది. ఇప్పుడు అలాంటి పవన్ తన ప్రొడ్యూసర్ శరత్ మారర్ తో బేధాభిప్రాయాలు వచ్చాయి అని అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు.

'కాటమరాయడు' సినిమాకు నిర్మాతగా ఉన్న శరత్ మారర్ ఆ సినిమా వలన కొంచం నష్టపోయాడునే చెప్పాలి. అంతే కాకుండా ఈ సినిమా కన్నా ముందు వచ్చిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా కూడా అనుకున్నంత విజయం దక్కలేదు. దాదాపుగా 'జాని' సినిమా నుండి వీళ్ళ మధ్య స్నేహం పెరుగుతూ వచ్చిందిని చెబుతూ ఉంటారు పవన్ కల్యాణ్ సన్నిహిత వర్గం. అయితే ఈ మధ్య పవన్ ఆఫీసు దగ్గర కానీ పవన్ కల్యాణ్కు సంబందించిన ఏ ఇతర ఫంక్షన్లు కానీ శరత్ మారర్ రావటం మానేశారు. ఎంత బిజీ గా ఉన్న ఏదో ఒక సమయంలో వీళ్ళు కలుస్తూ ఉండేవారు అంట. కానీ గత కొంత కాలంగా వీళ్ళ మధ్య దూరం పెరిగిందిని ఒక పుకారు వచ్చింది. కాటమరాయడు డిస్ట్రిబూటర్స్ వలన ఏవో కొన్ని సినిమా ఒత్తిడి వలన వీళ్ళ మద్య విబేధాలు ఏర్పడ్డాయి అని కూడా అనుకుంటున్నారు. అయితే  ఇదే విషయం పవన్ కల్యాణ్ ఆఫీసు వాళ్ళని అడిగితే అవి అన్నీ కేవలం పుకార్లు అని కొట్టిపారేశారు.

పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాలతోను రాజకీయంతో బిజీ అవ్వడం వలన శరత్ మారర్ కూడా ముందు కలిసిన అంతగా ఇప్పుడు కలవకపోవటం వలన ఈ గాలి వార్తలు పుట్టాయి అని చెబుతున్నారు. అలాగే శరత్ మరార్ కూడా యంగ్ హీరోలతో తాను చేసే సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే వీళ్ళు ఎప్పుడు కలిసే ఉండాలి అని కోరుకుంటున్నారు మన సినీ వర్గాలు.. కాని కనిపించనంత మాత్రాన విడిపోయారు అనుకుంటే ఎలా? పవన్ కూడా తన స్నేహాన్ని అంతా తొందరగా వదులుకునే మనిషి కాదు. అది సంగతి.
Tags:    

Similar News