ఇండియా-పాకిస్తాన్ మాచ్ లో బేబీ సమంతా

Update: 2019-06-16 08:08 GMT
స్టార్ హీరోయిన్ సమంతా తన సినిమాలపై ఎంత శ్రద్ధ తీసుకుంటుందో అందరికీ తెలిసిందే.  అద్భుతమైన నటనతో పాత్రలకు ప్రాణంపోయడమే కాదు..  సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ ను పీక్స్ లోకి తీసుకెళ్ళి.. ప్రేక్షకులందరి దృష్టిని తన చిత్రం వైపుకు మళ్ళిస్తుంది. మరోసారి అదేపనిలో బిజీగా ఉంది సమంతా.

సమంతా తాజా చిత్రం 'ఓ బేబీ' జులై 5 న విడుదల కానుంది. దీంతో జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంది.  ఇప్పటికే తన సోషల్ మీడియా ఖాతాలను 'సమంతా అక్కినేని' నుండి 'బేబీ అక్కినేని' గా మార్చుకుంది.  బేబీ అనగానే కొందరు ప్రబుద్ధులు రియల్ బేబీ వస్తోందని.. నాగార్జున తాత అవుతున్నారని భ్రమపడ్డారు. కానీ అదంతా ఏమీ లేదని 'ఓ బేబీ' ప్రమోషన్స్ లో భాగంగా 'బేబీ అక్కినేని' గా మార్చానని వెల్లడించింది.  ఇదిలా ఉంటే 'ఓ బేబీ' ప్రమోషన్స్ ను సమంతా నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళే ప్లాన్స్ వేసింది.

ఈ రోజు వరల్డ్ కప్ లో ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా.  ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ ఛానల్ వారు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు.  ఈ మ్యాచ్ కు కామెంటరీ గట్రా ఉంటాయి కదా. ఇక్కడే సమంతా తన కొత్త సినిమా ప్రచారం చేపడుతుందట. మ్యాచ్ హోస్టులతో మాట్లాడుతూ 'ఓ బేబీ' సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటుందట.  అసలే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు పనులు మానేసి టీవీల ముందు కూర్చుంటారు. ఇంతకంటే ది బెస్ట్ ప్రమోషన్ ఏముంటుంది?  ఇది పూర్తవగానే నాలుగు గంటల నుండి ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ తో కలిసి ట్విట్టర్ చాట్ లో పాల్గొంటుంది.   నెటిజన్లు తమ ప్రశ్నలను #AskSamantha హ్యాష్ టాగ్ ద్వారా సంధించవచ్చు.  వీలైనన్ని ప్రశ్నలకు సమంతా సమాధానం ఇస్తుంది.  


Tags:    

Similar News