అవార్డ్స్ ముందు ‘సీక్రెట్ కాల్’ నిజమేనా? పద్మ అవార్డ్స్ లో దాగిన రహస్యం!

భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాలుగా భావించే పద్మ అవార్డుల ఎంపిక వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి.

Update: 2026-06-30 05:37 GMT

భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాలుగా భావించే పద్మ అవార్డుల ఎంపిక వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. ప్రతి ఏటా ఈ అవార్డుల ప్రకటన తర్వాత ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. అయితే, ఈ అవార్డులను ప్రకటించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం ఒక రహస్య ప్రక్రియను నడుపుతుందని మీకు తెలుసా? ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు అందుకున్న సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్ దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన నిజాన్ని బయటపెట్టారు

మురళీమోహన్‌కు వచ్చిన ఆ ‘రహస్య ఫోన్ కాల్’:

పద్మ అవార్డుల జాబితా అధికారికంగా బయటకు రాకముందే మురళీమోహన్‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చిందట. ఇక అవార్డు ఇస్తున్నట్లు చెప్పడమే కాకుండా, ఆయన వ్యక్తిగత వివరాలను అధికారులు ముందుగా వెరిఫై చేశారట. ఆ తర్వాత "మేము మీకు పద్మశ్రీ ఇవ్వాలనుకుంటున్నాం, మీరు దీనిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా?" అని నేరుగా అడిగారట. దాంతో ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ముందే ఎందుకు అడుగుతారు? అసలు కారణం ఇదీ:

కేంద్ర ప్రభుత్వం ఇలా అవార్డు ప్రకటించే ముందే సదరు వ్యక్తి అనుమతి ఎందుకు తీసుకుంటుందో కూడా అధికారులు మురళీమోహన్‌కు వివరించారు. గతంలో కొంతమంది ప్రముఖులు తమకు పద్మశ్రీ రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక తమ స్థాయికి పద్మభూషణ్ లేదా పద్మవిభూషణ్ రావాలని భావించి, పద్మశ్రీని తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఉండడానికే ప్రభుత్వం ఇప్పుడు ముందే సమ్మతి తీసుకుంటోంది.

ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకూడదు:

ఈ ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత అధికారులు మురళీమోహన్‌కు ఒక కండిషన్ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా లిస్ట్ విడుదల చేసే వరకు ఈ విషయాన్ని భార్యాపిల్లలతో సహా ఎవరికీ చెప్పకూడదని ఆర్డర్ వేశారు. ఇక దీంతో ఆయన ఆ విషయాన్ని గుండెల్లోనే దాచుకోవాల్సి వచ్చింది. ఢిల్లీ వాళ్లకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరి గురించి తెలియడం కష్టం కాబట్టి, ఈ గుర్తింపు రావడం ఆలస్యమైనా దక్కడం సంతోషమని ఆయన అన్నారు.

ఫేక్ కాల్ అనుకుని భయపడ్డ నటుడు:

అధికారులు అంత సీక్రెట్‌గా ఫోన్ చేయడంతో మురళీమోహన్‌కు ఒకానొక దశలో ఇది నిజంగానే ప్రభుత్వ కాల్ ఆ? లేక ఎవరైనా ఫేక్ కాల్ చేసి ఆటపట్టిస్తున్నారా? అనే అనుమానం కూడా వచ్చిందట. అందుకే టీవీల్లో అధికారికంగా తన పేరు చూసే వరకు, అందరూ ఫోన్లు చేసి అభినందనలు తెలిపే వరకు ఆయన ఆ విషయాన్ని పూర్తిగా నమ్మలేకపోయారు.

పద్మ అవార్డుల వెనుక ఇంత పెద్ద కథ నడుస్తుందని మురళీమోహన్ చెప్పే వరకు సామాన్యులకు తెలియదు. అవార్డుల పారదర్శకతను కాపాడటానికి, వివాదాలకు తావు లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫాలో అవుతున్న ఈ 'సీక్రెట్ కాల్' పద్ధతి నిజంగానే భలే ఆసక్తికరంగా ఉంది కదూ..

Tags:    

Similar News