ఇటీవల 'టక్ జగదీశ్' సినిమాతో ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించిన నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు 'శ్యామ్ సింగ రాయ్' తో థియేటర్లలోకి వస్తున్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
దీని తర్వాత నాని తన కెరీర్ లో 28వ ప్రాజెక్ట్ గా 'అంటే.. సుందరానికీ!'' అనే ఆసక్తికర టైటిల్ తో సినిమా అనౌన్స్ చేశారు. ఇదే క్రమంలో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ 'దసరా' అనే మూవీని ప్రకటించారు.
''అంటే.. సుందరానికీ!'' సినిమాకి 'బ్రోచేవారెవరురా' ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతో మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా ఫహాద్ టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని - రవిశంకర్ వై. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అప్పుడెప్పుడో ఈ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ షూటింగ్ మొదలైనట్లు మేకర్స్ ప్రకటించారు.
నాని కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు నాని 'అంటే.. సుందరానికీ!' చిత్రాన్ని లైట్ తీసుకున్నారనే కామెంట్స్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం నాని ఫోకస్ మొత్తం 'శ్యామ్ సింగ్ రాయ్' సినిమా మీదే ఉంది. ఇది ఆయన కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన సినిమా. ఇన్నాళ్లూ తెలుగు ప్రేక్షకులను అలరించిన నేచురల్ స్టార్.. ఈసారి ఇతర ఇండస్ట్రీల మీదకు దృష్టి మళ్లిస్తున్నారు.
తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ భాషల్లోనూ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత నాని చేయాల్సిన సినిమా 'అంటే.. సుందరానికీ'. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.
షూటింగ్ ఎంతవరకు వచ్చిందో ఎవ్వరికి అప్ డేట్ లేదు. సాధారణంగా పండుగలప్పుడు స్పెషల్ పోస్టర్స్ తో శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు.. అప్పుడప్పుడు ఏదొక అప్డేట్ అందిస్తుంటారు. కానీ 'అంటే..' నుంచి ఎలాంటి ప్రచార చిత్రాలు విడుదల కాలేదు. ఓ అనౌన్స్ మెంట్ వీడియో మాత్రమే వచ్చింది.
ఈ నేపథ్యంలో నాని ఇప్పుడు 'దసరా' సినిమా మీద దృష్టి పెట్టి.. వివేక్ ఆత్రేయ చిత్రాన్ని లైట్ తీసుకుంటున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఏదైనా సమాచారం ఇచ్చి ఊహాగానాలకు తెర దించుతారేమో చూడాలి.
దీని తర్వాత నాని తన కెరీర్ లో 28వ ప్రాజెక్ట్ గా 'అంటే.. సుందరానికీ!'' అనే ఆసక్తికర టైటిల్ తో సినిమా అనౌన్స్ చేశారు. ఇదే క్రమంలో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ 'దసరా' అనే మూవీని ప్రకటించారు.
''అంటే.. సుందరానికీ!'' సినిమాకి 'బ్రోచేవారెవరురా' ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతో మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా ఫహాద్ టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని - రవిశంకర్ వై. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అప్పుడెప్పుడో ఈ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ షూటింగ్ మొదలైనట్లు మేకర్స్ ప్రకటించారు.
నాని కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు నాని 'అంటే.. సుందరానికీ!' చిత్రాన్ని లైట్ తీసుకున్నారనే కామెంట్స్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం నాని ఫోకస్ మొత్తం 'శ్యామ్ సింగ్ రాయ్' సినిమా మీదే ఉంది. ఇది ఆయన కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన సినిమా. ఇన్నాళ్లూ తెలుగు ప్రేక్షకులను అలరించిన నేచురల్ స్టార్.. ఈసారి ఇతర ఇండస్ట్రీల మీదకు దృష్టి మళ్లిస్తున్నారు.
తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ భాషల్లోనూ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత నాని చేయాల్సిన సినిమా 'అంటే.. సుందరానికీ'. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.
షూటింగ్ ఎంతవరకు వచ్చిందో ఎవ్వరికి అప్ డేట్ లేదు. సాధారణంగా పండుగలప్పుడు స్పెషల్ పోస్టర్స్ తో శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు.. అప్పుడప్పుడు ఏదొక అప్డేట్ అందిస్తుంటారు. కానీ 'అంటే..' నుంచి ఎలాంటి ప్రచార చిత్రాలు విడుదల కాలేదు. ఓ అనౌన్స్ మెంట్ వీడియో మాత్రమే వచ్చింది.
ఈ నేపథ్యంలో నాని ఇప్పుడు 'దసరా' సినిమా మీద దృష్టి పెట్టి.. వివేక్ ఆత్రేయ చిత్రాన్ని లైట్ తీసుకుంటున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఏదైనా సమాచారం ఇచ్చి ఊహాగానాలకు తెర దించుతారేమో చూడాలి.