గండాన్ని దాటొచ్చి పిల్లలు కావాలంటోంది

Update: 2017-02-21 04:07 GMT
ఓ తరం వెనుక బాలీవుడ్ భామల్లో మనీషా కొయిరాలా రేంజ్ వేరుగా ఉండేది. దక్షిణాది చిత్రాల్లో నటించడానికి అక్కడి బ్యూటీస్ సంకోచించే రోజుల్లోనే.. సౌత్ సినిమాలతో సెన్సేషన్స్ సృష్టించేసింది. బాంబాయి.. ఒకే ఒక్కడు.. భారతీయుడు లాంటి ఈమె బ్లాక్ బస్టర్స్ లో ఎక్కువ వాటా సౌత్ సినిమాలదే.

ఆ తర్వాత ఈ నేపాలీ అందగత్తె సినిమాల సంఖ్య మెల్లగా తగ్గగా.. 2010లో సమ్రాట్ దహల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని.. రెండేళ్లకే విడాకులు ఇచ్చేసింది. అప్పుడే ఆమె అండాశయ క్యాన్సర్ తో బాధ పడుతోందనే విషయం బైటపడింది. అక్కడి నుంచి క్యాన్సర్ తో యుద్ధం చేసి గండాన్ని దాటిన మనీషా కొయిరాలా.. ఇప్పుడు పిల్లల కోసం ఎదురుచూస్తోంది. ఇందుకోసం దత్తత బాట పట్టింది మనీషా. ఓ కూతురుని కనాలన్నది ఈమె కోరిక కాగా.. ఇప్పుడు దత్తత ద్వారా ఓ కూతురుకు అమ్మయ్యేందుకు ఆరాపడుతోంది.

తన జీవితం మొత్తం కూతురు చుట్టూ తిరిగేలా మలిచేసుకోవాలన్నది మనీషా కొయిరాలా ఆలోచన. ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈమెకు.. ఇప్పుడు 'దత్' అంటూ తీస్తున్న సంజయ్ దత్ బయోపిక్ రూపంలో.. ఓ అద్భుతమైన అవకాశాన్ని అందుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News