చాలామంది చేతిలో మోస‌పోయా..మంచు ల‌క్ష్మి!

Update: 2018-07-20 15:29 GMT
టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే, త‌న తండ్రి మోహ‌న్ బాబుతో పాటు త‌న ఫ్యామిలీ కార్డ్ ను వాడ‌కుండానే....త‌న‌కంటూ మ‌రింత ప్రత్యేక‌మైన గుర్తింపును మంచు ల‌క్ష్మి సొంతం చేసుకుంది. `ఐరేంద్రి` పాత్ర‌తో తెరంగేట్రం చేసిన మంచు ల‌క్ష్మి ...ఆ త‌ర్వాత న‌టిగా - నిర్మాత‌గా - ద‌ర్శ‌కురాలిగా....భిన్న పార్శ్వాల‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది. న‌టిగానే కాకుండా `మేము సైతం` వంటి కార్య‌క్ర‌మాల‌తో స‌మాజ సేవ కూడా చేస్తోంది. తాజాగా, `వైఫ్ ఆఫ్ రామ్` తో మంచు ల‌క్ష్మి మ‌రోసారి  ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రం విడుద‌ల సంద‌ర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ల‌క్ష్మి ప‌లు ఆసక్తికర విషయాలు వెల్ల‌డించింది. సినిమా తనను ఎప్పుడూ మోసం చేయలేదని, మనుషులు మోసం చేయ‌డం వ‌ల్ల న‌ష్ట‌పోయాన‌ని చెప్పింది. గ‌తంలో కొన్ని సినిమాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాన‌ని, ఆ స‌మ‌యంలో చేసిన అప్పులు ఇప్ప‌టికీ తీర‌లేద‌ని తెలిపింది. `వైఫ్ ఆఫ్ రామ్` విజ‌యం సాధించి ....తన అప్పులన్నీ తీరాల‌ని ఆకాంక్షించింది.

‘మేము సైతం' అనే షో చాలామందికి ఉప‌యోగ‌ప‌డింద‌ని, ఆ షోలో పాల్గొన్న వారి క‌ష్టాలు విని... ఆ బాధను త‌న‌లో నింపుకుంటున్నాన‌ని చెప్పింది. అయితే, తాను బాధ‌ప‌డ‌డం మోహ‌న్ బాబుకు న‌చ్చ‌డం లేద‌ని - అందుకే ఆ షో చేయ‌వ‌ద్ద‌ని చెప్పార‌ని తెలిపింది.

‘గుండెల్లో గోదారి' సినిమాతో అప్పులపాల‌య్యాన‌ని, వాటిని ఇప్పటికీ తీరుస్తూనే ఉన్నాన‌ని చెప్పింది. తాను తీసుకున్న ప్రతి రూపాయి తిరిగి ఇస్తాన‌ని - అప్పుల వ‌ల్లే మనశ్శాంతిగా నిద్రపోలేక‌పోతున్నాన‌ని చెప్పింది. త‌న‌కు డబ్బులు ఇవ్వాల్సిన‌వారు చాలామంది ఉన్నార‌ని - త‌న‌కు బ‌కాయిప‌డ్డ‌ 23 లక్షలు ఇవ్వ‌కుండా ఓ వ్య‌క్తి వేరే పేరుతో సినిమాలు విడుద‌ల చేస్తున్నార‌ని చెప్పింది. మోహన్ బాబు గారి కూతురును ఎవ‌రు మోసం చేస్తారని అనుకోవడం వల్లే చాలా మంది త‌న‌ను సుల‌భంగా మోసం చేశార‌ని తెలిపింది. త‌న‌ను ఏమైనా అంటే త‌న్న‌డానికి ముగ్గురున్నార‌ని - కానీ తన్నడాన్ని కూడా మీడియా ర‌క‌ర‌కాలుగా చూపిస్తోంద‌ని చెప్పింది. ఇపుడు సినీ కెరీర్ 6-10 సంవత్సరాలు ఉంటేనే గొప్ప అని చెప్పింది. అందుకే సినిమాల‌తోపాటు వ్యాపారం చేయాల‌ని....ప్ర‌స్తుతం జూనియర్ కుప్పన్న హోటల్ బిజినెస్ లోకి దిగాన‌ని చెప్పింది.
Tags:    

Similar News