కృతి కంటే అతడి ఆరబోతే ఎక్కువ

Update: 2017-05-24 09:47 GMT
ఎంఎస్ ధోనీ మూవీ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. 1నేనొక్కడినే చిత్రంలో మహేష్ సరసన నటించిన కృతి సనోన్ ల మధ్య వ్యవహారం బాగా పీక్ స్టేజ్ లోకి వచ్చేసిందన్నది బాలీవుడ్ టాక్. రాబ్తా మూవీలో ఇద్దరూ కలిసి నటించడం మొదలుపెట్టిన తర్వాత.. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం బాగా ముదిరి పాకాన పడిందని అంటున్నారు.

ఇప్పుడీ రాబ్తా చిత్రంలోని 'మై తేరా బాయ్ ఫ్రెండ్' అంటూ సాగే ఓ పాటను రిలీజ్ చేశారు. అదిరిపోయే బీట్ కి.. అంతకంటే స్పీడ్ గా స్టెప్స్ వేసి అలరించారు సుశాంత్- కృతి. డ్యాన్స్ విషయంలో ఇద్దరూ కుమ్మేశారని చెప్పాలి. సుశాంత్-కృతిల మధ్య కుదిరిన కెమిస్ట్రీ ఈ సాంగ్ కు అసలు సిసలైన అట్రాక్షన్. లిరిక్ కూడా వీరి రియల్ లైఫ్ దగ్గరగానే ఉండడం విశేషం. నేను నీ బాయ్ ఫ్రెండ్.. నువ్వు నా గాళ్ ఫ్రెండ్ అంటూ అర్ధం వచ్చేలా ఉన్న పాట వినడానికే కాదు.. చూసేందుకు కూడా సూపర్బ్ గా ఉంది. అయితే.. అసలీ పాటలో ఎవరు ఎక్కువ ఎక్స్ పోజింగ్ చేశారనే క్వశ్చన్ వేసుకుంటే.. హీరోయిన్ కృతి సనోన్ ను మించిపోయి బాడీ ఎక్స్ పోజ్ చేసేశాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్.

నువ్వు నా గాళ్ ఫ్రెండ్ అని ఇంత డైరెక్టుగా చెబుతున్నపుడు.. రీసెంట్ గా ఫిలింఫేర్ మేగజైన్ కవర్ పేజ్ పై 'షో బిజ్ లేటెస్ట్ లవ్ బర్డ్స్' అని రాస్తే.. సుశాంత్ ఎందుకు అంతగా రియాక్ట్ అయిపోయాడో మరి.

Full View
Tags:    

Similar News