నిజానికి క్రిష్ 'కంచె' సినిమా చేసిన వెంటనే బ్యాక్ టు బ్యాక్ వరుణ్ తేజ్ తో మరో సినిమాను చేసేందుకు ప్లానింగ్ చేసుకున్నారు. ఏమైందో తెలియదు కాని.. సడన్ గా ''రాయభారి'' సినిమాను చేద్దామనుకున్న క్రిష్ అండ్ వరుణ్ లు.. ఆ ప్రాజెక్టుకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. వెంటనే మనోడు వేరే సినిమాలతో బిజీ అయితే.. క్రిష్ కూడా బాలయ్య 100వ సినిమా వైపు అడుగులు వేశాడు. బాగానే ఉంది.
అయితే ఈ రాయభారి కథను ఇప్పుడు రామ్ చరణ్ చేస్తున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. మనోడు మొన్నామధ్యన ఒక ఇంటర్యూలో మాట్లాడుతూ.. తదుపరి ఒక జేమ్స్ బాండ్ తరహా గూడఛారి సినిమాను చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. కథ వండుతున్నారని.. ఓకె అయిన వెంటనే ఎనౌన్స్ చేస్తానని అన్నాడు. విషయం ఏంటంటే.. అప్పట్లో రాయభారి అంటూ వరుణ్ తేజ్ కు ఇచ్చిన సదరు స్టోరీనే ఇప్పుడు మన హీరో అన్న చరణ్ దగ్గరకు పంపాడట. దాంట్లో చరణ్ మార్పులు చెప్పడంతో క్రిష్ వాటి మీదన పనిచేయిస్తున్నాడని ఒక టాక్ వినిపిస్తోంది.
ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ సినిమా పట్టాలెక్కాలంటే మాత్రం ఇంకా చాలా టైమ్ పడుతుంది. సుకుమార్ సినిమాను మొదలెట్టాలని ఒక ప్రక్కన చరణ్ సన్నద్దమవుతుంటే.. వెంకటేష్ తో చేయాల్సిన సినిమా కోసం క్రిష్ కసరత్తులు చేస్తున్నాడు. అది సంగతి.
అయితే ఈ రాయభారి కథను ఇప్పుడు రామ్ చరణ్ చేస్తున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. మనోడు మొన్నామధ్యన ఒక ఇంటర్యూలో మాట్లాడుతూ.. తదుపరి ఒక జేమ్స్ బాండ్ తరహా గూడఛారి సినిమాను చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. కథ వండుతున్నారని.. ఓకె అయిన వెంటనే ఎనౌన్స్ చేస్తానని అన్నాడు. విషయం ఏంటంటే.. అప్పట్లో రాయభారి అంటూ వరుణ్ తేజ్ కు ఇచ్చిన సదరు స్టోరీనే ఇప్పుడు మన హీరో అన్న చరణ్ దగ్గరకు పంపాడట. దాంట్లో చరణ్ మార్పులు చెప్పడంతో క్రిష్ వాటి మీదన పనిచేయిస్తున్నాడని ఒక టాక్ వినిపిస్తోంది.
ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ సినిమా పట్టాలెక్కాలంటే మాత్రం ఇంకా చాలా టైమ్ పడుతుంది. సుకుమార్ సినిమాను మొదలెట్టాలని ఒక ప్రక్కన చరణ్ సన్నద్దమవుతుంటే.. వెంకటేష్ తో చేయాల్సిన సినిమా కోసం క్రిష్ కసరత్తులు చేస్తున్నాడు. అది సంగతి.