ఖైదీ కోసం మరో మెగా ఈవెంట్!!

Update: 2017-01-16 05:37 GMT
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150కి రిలీజ్ రోజు నుంచే బ్రహ్మాండమైన టాక్ మాత్రమే కాదు.. అనూహ్యమైన వసూళ్లు కూడా వస్తున్నాయి. వీకెండ్స్ లో వచ్చే కలెక్షన్స్ ను.. వీక్ డేస్ లో కూడా రాబట్టగలగడం..మెగాస్టార్ స్టామినాకి నిదర్శనం. ఖైదీ నంబర్ 150 మూవీ రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ బాగా చేసిన టీం.. తర్వాత స్లో అయిందనే టాక్ వినిపించింది.

దీంతో.. మళ్లీ ఇంటర్వ్యూల లాంటి వాటితో హంగామా చేస్తోంది ఖైదీ యూనిట్. ఇప్పుడు థ్యాంక్యూ మీట్ పేరుతో..  ఖైదీ కోసం మరో మెగా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఏ మాత్రం తగ్గకుండా.. దీన్ని కూడా నిర్వహించబోతున్నారని అంటున్నారు. ఇది హైద్రాబాద్ లోనే జరిగే అవకాశాలు ఉన్నాయట. అల్లు అరవింద్ ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కోసం సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. తనకు ఈ స్థాయిలో తిరిగి ఆహ్వానం పలికిన టాలీవుడ్ ఆడియన్స్ కు అభిమానులకు కృతజ్ఞతలు చెప్పడమే ఈ ఈవెంట్ నిర్వహించడానికి కారణం అంటున్నారు.

అయితే.. ఈ థ్యాంక్యూ మీట్ కు పవన్ కళ్యాణ్ ను తప్పనిసరిగా తీసుకురావాలని యోచిస్తున్నారట. పవన్ లేకుండా మరోసారి మెగా ఈవెంట్ ఏర్పాటు చేస్తే.. మరిన్ని విమర్శలకు దారితీసే అవకాశం ఉండడంతో.. థ్యాంక్యూ మీట్ లో పవన్ కనిపించనున్నాడని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News