కాజోల్ ఆ ఆలోచన వదిలేసిందట..

Update: 2017-08-05 08:31 GMT
బాలీవుడ్లో పెళ్లయి దశాబ్దం దాటినా విడిపోకుండా అన్యోన్యంగా ఉన్న అతి తక్కువ జంటల్లో అజయ్ దేవగణ్-కాజల్ పెయిర్ ఒకటి. ఐతే ఎంత అన్యోన్యంగా ఉన్నప్పటికీ భర్తకు సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ ఉన్నప్పటికీ తాను సొంతంగా ఓ నిర్మాణ సంస్థను మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సెప్టెంబర్లోనే తన పేరిట నిర్మాణ సంస్థ మొదలవుతుందని ఆమె ఇంతకుముందు ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకుంటున్నట్లు కాజోల్ స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. తన భర్తకు ప్రొడక్షన్ హౌజ్ ఉండగా.. ఇప్పుడు మళ్లీ తాను నిర్మాణ సంస్థను మొదలుపెట్టడం ఎందుకనిపిస్తోందని.. భర్త చాటు భార్యగా ఉండటానికే తాను ఇష్టపడతానని తెలిపింది కాజోల్.

తాను ఏం చేయాలన్నా సహజంగా అనిపిస్తేనే చేస్తానని.. బలవంతంగా చేయాల్సిన అవసరం లేదని.. ప్రొడక్షన్ హౌజ్ మొదలుపెట్టే విషయంలోనూ ఇలాగే ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు కాజోల్ చెప్పింది. భర్త నిర్మాణ సంస్థను బలోపేతం చేయడం మీదే ప్రస్తుతం తన దృష్టంతా న్నట్లు కాజోల్ తెలిపింది. ‘‘అజయ్ దేవగణ్ ఫిలిమ్స్ నుంచి దూరం జరగాల్సిన అవసరం నాకు కనిపించడం లేదు. ప్రొడక్షన్ గురించి నా కంటే మా ఆయనకే బాగా తెలుసు. ఈ విషయంలో భర్త చాటు భార్యగా ఉండటానికే ఇష్టపడతా. ఆయనకు నా సలహాలు ఇచ్చి ప్రొడక్షన్ కు సహకరిస్తా’’ అని కాజోల్ చెప్పింది. అజయ్ దేవగణ్ నిర్మాణంలో తెరకెక్కిన ‘శివాయ్’ ఫ్లాప్ కావడంపై స్పందిస్తూ.. ఆ వైఫల్యం ప్రభావం తన భర్త మీద పడిందని.. అయినప్పటికీ సొంత బేనర్లో మరిన్ని సినిమాలు చేయడానికి సన్నద్శమవుతున్నట్లు కాజోల్ తెలిపింది.
Tags:    

Similar News