రౌడీ మదర్ తో జాన్వీ ఫోటో వెనుక అసలు స్టోరీ

Update: 2022-12-06 09:30 GMT
గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ఈ ఫొటో తెగ వైరల్‌ అవుతోంది. అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ మరియు విజయ్‌ దేవరకొండ తల్లి మాధవి ఏ సమయంలో కలిసి ఉంటారు.. ఒక వేళ కలిసినా ఇంత క్లోజ్ గా ఎందుకు ఫొటో దిగారు అంటూ రకరకాలుగా ప్రచారాలు మొదలు అయ్యాయి.

ఎవరికి తోచిన విధంగా వారు ఊహల్లో విహరిస్తూ ఉన్నారు. ఈ ఫొటో వెనుక కారణం ఏంటీ.. అసలు వీరిద్దరి కలయిక ఎక్కడ జరిగింది అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అసలు విషయం ఏంటీ అంటే వీరిద్దరు ఒక షూటింగ్‌ సందర్భంగా కలిశారట.

విజయ్ దేవరకొండ ఇటీవల ఒక యాడ్‌ షూట్‌ నిమిత్తం ముంబయి వెళ్లాడు. అప్పుడే తల్లి మాధవి ని వెంట పెట్టుకుని వెళ్లాడట. యాడ్‌ షూటింగ్‌ సెట్‌ లో మాధవి కూడా ఉన్నారు. అదే యాడ్‌ లో జాన్వీ కపూర్ కూడా నటించారు. విజయ్ దేవరకొండ మరియు జాన్వీ కపూర్ కలిసి నటించిన ఆ యాడ్ త్వరలో రాబోతుంది.

ఆ యాడ్‌ చిత్రీకరణ సందర్భంగానే ఇలా జాన్వీ కపూర్ మరియు మాధవి లు కలిసి ఫోటో దిగారట. ఈ ఫొటో గురించి జరుగుతున్న ప్రచారం నిజం కాదని.. అసలు వీరిద్దరికి అంతకు ముందు వరకు పరిచయం కూడా లేదని తెలుస్తోంది.

గతంలో కూడా విజయ్ దేవరకొండతో కలిసి నటించిన హీరోయిన్స్ తో మాధవి ఇలాగే ఫొటోలు దిగారు. అయితే ఈసారి మాత్రం ఆ ఫొటో బయటకు రావడంతో చర్చ మొదలు అయ్యింది.
Tags:    

Similar News