నేను మనిషినే కదా అందుకే వచ్చాయి!

Update: 2020-07-02 05:15 GMT
స్టార్స్ ఇంకా సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా ఎంతగా ప్రయోజనం పొందుతారో అంతగా కొన్ని సార్లు మానసిక ఆందోళన పడాల్సి వస్తుంది. అలాగే కొన్ని సార్లు ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సంబంధం లేకుండా కొందరు చేసే కామెంట్స్ కు స్టార్స్ కొన్ని సార్లు చిరాకు కూడా పడతారు. తాజాగా ఒక అభిమాని ఇలియానాను చిరాకు పెట్టడంతో ఆమె సహనం కోల్పోయి షాకింగ్ కామెంట్స్ చేసింది.

సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తి ఇలియానా మీకు మొటిమలు వచ్చాయి కదా అంటూ ప్రశ్నించారు. అందుకు స్పందించిన ఇలియానా నేను మనిషినే కదా నాకు మొటిమలు ఎందుకు రావు. అందరి మాదిరిగా నేను కూడా మనిషిని అయినప్పుడు నాకు మొటిమలు రాకుండా ఎలా ఉంటాయి అంటూ అసహనంతో ప్రశ్నించింది. ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఆఫర్లు తగ్గడం వల్ల బ్యూటీ పై శ్రద్ధ తగ్గించింది అని అందుకే ఇలా మొటిమలు వచ్చి ఉంటాయి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ కారణంగానే ఇలియానా అసహనం తో సీరియస్ అయ్యింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమా మినహా ఇంకా ఏమి సినిమాలు చేయడం లేదు. సౌత్ సినిమాలు చేసేందుకు ఈ అమ్మడు సిద్ధం గా ఉన్నా కూడా ఛాన్స్ లు మాత్రం రావడం లేదు. ఈ సమయంలో ఈమె వెబ్ సిరీస్ ల్లో నటించే అవకాశం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి.
Tags:    

Similar News