అరవింద్ స్వామికి డబ్బింగ్ ఎవరంటే..

Update: 2016-11-30 07:52 GMT
‘ధృవ’ ట్రైలర్లో అరవింద్ స్వామి వాయిస్ వింటే.. తెలుగు సినిమాల్లో పర భాషా విలన్లకు రెగ్యులర్ గా డబ్బింగ్ చెప్పే వాళ్లెవరూ అతడికి వాయిస్ ఇవ్వలేదన్న విషయం అర్థమైపోతుంది. ఈ వాయిస్ కొంచెం ఫెమియిలర్ గా ఉంటూనే.. కొత్తగా కూడా అనిపించింది. ఆ వాయిస్ ఎవరిదో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. సింగర్ హేమచంద్ర.. అరవింద్ స్వామికి డబ్బింగ్ చెప్పడం విశేషం.

‘ధృవ’లో అరవింద్ స్వామి పాత్ర ఎంత కీలకమో ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. తమిళ వెర్షన్లో మాదిరే.. తెలుగులోనూ అరవింద్ పాత్ర హైలైట్ అయ్యేలా ఉంది. వైవిధ్యమైన ఈ పాత్రకు డబ్బింగ్ కూడా ప్రత్యేకంగా ఉండాలని హేమచంద్రతో వాయిస్ ఇప్పించాడు సురేందర్ రెడ్డి. హేమచంద్ర ఇంతకుముందు తమిళ డబ్బింగ్ మూవీ ‘స్నేహితుడు’లో విజయ్ కు డబ్బింగ్ చెప్పాడు. అప్పుడు హీరోకు వాయిస్ ఇచ్చి.. ఇప్పుడు విలన్ గా డబ్బింగ్ చెబుతుండటం విశేషం. సింగర్ గా ఫేమస్ అయిన హేమచంద్ర.. ఈ సినిమా తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టుగానూ మరిన్ని అవకాశాలు అందుకుంటాడేమో.

‘ధృవ’ ఇంకో పది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. డిసెంబరు 9న సినిమా విడుదలవుతుండగా.. 4న హైదరాబాద్ లో ‘ధృవ’ ప్రి రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు నిర్మాత అల్లు అరవింద్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News