ఆ రెండు గ్రౌండ్స్ లో బాలయ్య ఎక్కడో

Update: 2016-12-04 09:30 GMT
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ నెలలోనే ఈ సినిమా ఆడియో లాంచ్ అవ్వబోతోంది. అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ మొత్త పూర్తయిపోవడంతో.. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా సత్వరంగానే కంప్లీట్ అయిపోతుండటంతో.. సినిమా జనవరి 2017న ధియేటర్లలో రచ్చ చేయడానికి రెడీ అయిపోతోంది.

ఈ సందర్భంగా అసలు ఆడియో లాంచ్ ఏ రేంజులో జరుగుతుంది అనే క్యూరియాసిటీ సాధారణంగా అందరిలో ఉంటుంది. ఇంతకీ ఈ సినిమా ఆడియో తిరుపతిలో ఎక్కడ జరగనుందో తెలుసా? తిరుపతిలోని ఎన్టీఆర్‌ స్టేడియం, నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో ఏదో ఒకదానిలో ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారట నిర్మాతలు. ఈ సినిమా ప్రొడ్యూసర్ రాజీవ్‌ రెడ్డి ఆదివారం తిరుపతికి విచ్చేసి ఎన్టీఆర్‌ స్టేడియం, నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లను పరిశీలించి.. రెండింటిలో ఒకటి ఫైనల్ చేస్తామని చెప్పుకొచ్చారు.

కట్ చేస్తే.. రెండు గ్రౌండ్స్ లో బాలయ్య రచ్చ ఎక్కడనేది ఫైనల్ అయిపోతే.. అభిమానులు కటౌట్లు అండ్ ఫ్లెక్సీ బోర్డులతో హంగామా చేయడానికి రెడీ అయిపోతున్నారు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News