పవన్ తో కాలేదు.. చిరుతో అంటున్నాడు

Update: 2017-01-20 11:42 GMT
స్టార్లను కాకుండా కథల్ని నమ్ముకుని సినిమాలు తీసి అదిరిపోయే హిట్లు కొట్టిన నిర్మాత దిల్ రాజు. ఎక్కువగా కొత్త వాళ్లతో సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాక స్టార్ల వైపు మళ్లాడు రాజు. ఐతే మధ్యలో మళ్లీ కొత్త వాళ్లతో జర్నీ సాగించిన రాజు.. ఇప్పుడు మళ్లీ స్టార్లతో సినిమాలంటున్నాడు. ఆల్రెడీ అల్లు అర్జున్ తో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లిన రాజు.. దీని తర్వాత మహేష్ బాబు హీరోగా సినిమా చేయబోతున్నాడు. దీని తర్వాత రాజు టార్గెట్ మెగాస్టార్ చిరంజీవి అట.

తన సినిమా ‘శతమానం భవతి’ సంక్రాంతి రేసులో ఉన్నప్పటికీ దాంతో పాటుగా రిలీజైన ‘ఖైదీ నెంబర్ 150’ సెన్సేషనల్ కలెక్షన్స్ రాబడుతుండటం పట్ల దిల్ రాజు సంతోషం వ్యక్తం చేశాడు. తాను చిరంజీవిని వ్యక్తిగతంగా కలిసి మరీ ఈ సినిమా విజయంపై అభినందించినట్లు రాజు తెలిపాడు. చిరు ఛాన్సిస్తే ఆయనతో సినిమాను నిర్మించాలని తనకు ఎంతో ఆశగా ఉందని రాజు చెప్పాడు. చిరు కోసం సరైన స్క్రిప్టు దొరికితే కచ్చితంగా ఆయన్ని అప్రోచ్ అవుతానని రాజు తెలిపాడు. చిరు కంటే ముందు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా తీయాలని ఆశ పడ్డాడు రాజు. అది తన జీవిత లక్ష్యం అన్నట్లుగా మాట్లాడాడు. ఐతే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాజు కల నెరవేరేలా లేదు. ఈ నేపథ్యంలో పవన్ తో కాకపోయినా చిరుతో అయినా సినిమా చేయాలని రాజు భావిస్తున్నట్లున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News