రాజు గారి క్యాంపు దాటాక జాగ్రత్త

Update: 2016-05-27 17:30 GMT
ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ప్రొడక్షన్ హౌజ్ కి స్టార్ డం తీసుకొచ్చిన నిర్మాత దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కింద వచ్చే సినిమాలపై జనాలు ఆసక్తిగా ఎదురుచూసేంతటి పేరు తీసుకొచ్చాడు. స్వతహాగా డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు.. మూవీ మేకింగ్ లో తనదైన ముద్ర వేస్తూ.. ఎంతో మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. దిల్ రాజు బ్యానర్ లో పరిచయమైన కొందరు దర్శకులు.. ఆ క్యాంపు నుంచి బైటకు వచ్చాక హిట్లు ఇవ్వలేకపోతున్నారు.

రీసెంట్ గా బ్రహ్మోత్సవంతో సూపర్ స్టార్ మహేష్ బాబుకు షాక్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాలను.. పరిచయం చేసింది దిల్ రాజునే. ఈయన బ్యానర్ లో కొత్త బంగారు లోకం తీసి సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంటూ కుటుంబ కథా చిత్రాన్ని కూడా దిల్ రాజుకే తీసి మరో హిట్ కొట్టాడు. కానీ ఆ తర్వాత బయటకు వచ్చి వరుణ్ తేజ్ ని లాంఛ్ చేస్తూ తీసిన ముకుందకు విమర్శలు వచ్చాయి. అయినా మహేష్ మాత్రం నమ్మి బ్రహ్మోత్సవం ఇస్తే.. దాని సంగతి తెలిసిందే.

బొమ్మరిల్లుతో భాస్కర్ ను తీసుకొచ్చాడు దిల్ రాజు. ఆ తర్వాత బన్నీతో చేసిన పరుగుతోనూ మరో సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత రామ్ చరణ్ తో భాస్కర్ తీసిన ఆరెంజ్-  రామ్ తో తీసిన ఒంగోలు గిత్త పేలిపోయాయి. వీళ్లు కాకుండా.. సుకుమార్ - బోయపాటి శ్రీను - వంశీ పైడిపల్లిలు మాత్రం సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు.

జోష్ తో తనకే షాక్ ఇచ్చిన వాసు వర్మకు మరో ఛాన్స్ ఇచ్చాడు దిల్ రాజు. ఇక వేణు శ్రీరామ్ కూడా ఓ మై ఫ్రెండ్ అంటూ దిల్ రాజుకు షాక్ ఇచ్చిన బాపతే. ఇతనికి కూడా మరో ఛాన్స్ దిల్ రాజే ఇస్తానన్నాడు కానీ.. ఇంకా ఆ ప్రాజెక్ట్ పైనల్ కాలేదు.
Tags:    

Similar News