దిల్‌ రాజు సూచనతో బండ్ల ముందడుగు

Update: 2019-06-25 01:31 GMT
ఆర్ధిక ఇబ్బందుల కారణంగా చాలా కాలంగా నిర్మాణంకు దూరంగా ఉంటూ వచ్చిన బండ్ల గణేష్‌ ఎట్టకేలకు మళ్లీ నిర్మాణంలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. కృష్ణ వంశీ చాలా ఏళ్లుగా పట్టుకుని తిరుగుతున్న 'రుద్రాక్ష' మూవీని బండ్ల గణేష్‌ నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. బండ్ల గణేష్‌ ఆర్ధిక సమస్యలు తొలగి పోవడంతో నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వచ్చాడట. అయితే ఇకపై చేయబోయే ప్రతి సినిమా విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని బండ్ల గణేష్‌ నిర్ణయించుకున్నాడట.

కృష్ణ వంశీ రెడీ చేసిన 'రుద్రాక్ష' కథపై కాస్తో కూస్తో అనుమానాలు ఉండగా నిర్మాత దిల్‌ రాజు వద్దకు వెళ్లి ఈ కథతో సినిమా తీస్తే ఎలా ఉంటుందని సలహా అడిగాడట. స్క్రిప్ట్‌ పర్‌ ఫెక్ట్‌ గా ఉండటం వల్ల తప్పకుండా సినిమా కూడా బాగుంటుందనే నమ్మకంను దిల్‌ రాజు వ్యక్తం చేయడంతో బండ్ల గణేష్‌ ప్రొసీడ్‌ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

హర్రర్‌ నేపథ్యంలో రూపొందబోతున్న ఈ చిత్రంలో ఒక ప్రముఖ స్టార్‌ హీరోయిన్‌ ను నటింపజేసేందుకు కృష్ణ వంశీ ప్రయత్నాలు చేస్తున్నాడు. కృష్ణ వంశీతో గతంలో బండ్ల బాబు 'గోవిందుడు అందరి వాడే' చిత్రంను చేసిన విషయం తెల్సిందే. ఆ చిత్రం బండ్ల గణేష్‌ కు నష్టాలను మిగిల్చింది. మరి ఈసారైనా క్రియేటివ్‌ డైరెక్టర్‌ నిర్మాత బండ్ల గణేష్‌ కు సక్సెస్‌ ను మరియు లాభాలను తెచ్చి పెడతాడా అనేది చూడాలి.

Tags:    

Similar News