ధనుష్ దర్శకుడు.. రజినీ హీరో

Update: 2017-04-27 08:17 GMT
నటుడిగానే కాక గాయకుడిగా.. లిరిసిస్టుగా.. స్క్రీన్ ప్లే రచయితగా తనలోని రకరకాల టాలెంట్లను ఇంతకుముందే చూపించాడు ధనుష్. ఇప్పుడు ఏకంగా మెగాఫోన్ కూడా పట్టేసి.. ‘పా పాండి’ సినిమాతో దర్శకుడిగానూ మారాడు. అందులోనూ విజయవంతమయ్యాడు. ‘పా పాండి’ సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది తమిళనాట. ఈ ఉత్సాహంలో అతను ‘పా పాండి’కి సీక్వెల్ కూడా తీసేయాలని ఆరాటపడుతున్నాడు. కుదిరితే ఆ చిత్రంలో తన మామ.. సూపర్ స్టార్ రజినీకాంత్ ను హీరోను చేయాలనుకుంటున్నాడు. రజినీకాంత్ ఒప్పుకుంటే కచ్చితంగా ఆయనే హీరోగా ‘పా పాండి’ సీక్వెల్ తీస్తానని ధనుష్ ప్రకటించాడు.

దర్శకుడిగా తాను సినిమా చేయాలని కోరుకునే తొలి హీరో రజినీకాంతే అని ధనుష్ చెప్పడం విశేషం. తెరపై ఎప్పుడూ లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లే చేసే రజినీకాంత్.. ఈ మధ్యే ‘కబాలి’లో తన వయసుకు తగ్గ పాత్రలో కొంచెం సామాన్యుడిలా కనిపించాడు. మరి ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ‘పా పాండి’ సీక్వెల్ లో నటిస్తాడేమో చూడాలి. ఇందులో హీరో 60 ఏళ్ల వయసువాడు. ఆ పాత్రలో రాజ్ కిరణ్ అద్భుతంగా నటించాడు. ఆ పాత్ర ఆయన కోసమే పుట్టిందా అన్నట్లుగా చేశాడు. మరి అంత బాగా చేసిన రాజ్ కిరణ్ ను కాదని ధనుష్ సీక్వెల్ కోసం రజినీని ఎంచుకుంటాడా.. రజినీ ఈ సీక్వెల్ చేయడానికి ఒప్పుకుంటాడా.. చూద్దాం మరి. ‘పా పాండి’ తెలుగు రీమేక్ లో రజినీ మిత్రడు మోహన్ బాబు నటించబోతున్న సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News