హీరో హీరోయిన్లు ఓట్లేసత్తన్నారుగా..

Update: 2017-02-21 08:09 GMT
ఇవాళ ముంబైలో మహా సమరం జరుగుతోంది. మునిసిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్ ఇవాళే. ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావించి ప్రచారం చేసుకోగా.. ఇప్పుడు పోలింగ్ సరళిని ఆసక్తిగా గమనిస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ యంగ్ జనరేషన్ అంతా.. బాధ్యతాయుతంగా ఓటు వేయడంతో పాటు.. ఇతరులకు తమ హక్కును బాధ్యతను గుర్తు చేస్తున్నారు.

యంగ్ సెన్సేషన్ రణవీర్ సింగ్.. ఉదయాన్నే ఓటు వేసేయడమే కాదు.. తాను ఓటు వేసినట్లుగా వేలిపై ఉన్న మచ్చను చూపిస్తూ.. ఓ ఫోటో దిగి నెట్ లో పోస్ట్ చేశాడు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా ఇలాగే ఓటు వేశానని చెబుతూ.. 'నేను ఓటు వేసేశాను.. మీ హక్కును మీరు ఉపయోగించుకోండి. ఓటు వేయడానికి వెళ్లండి' అంటూ చిన్నపాటి సందేశాన్ని కూడా ఇచ్చింది. ఇక అనుష్క శర్మ అయితే.. ఇవాల్టి తన రోజును ఓటుతోనే మొదలుపెట్టానని చెబుతోంది.

'ఈ రోజు ఉదయాన్ని ఓటేయడంతో ప్రారంభించాను. ఓటు వేయడం మన దేశం కోసం.. అభివృద్ధి కోసం మనం నిర్వహించాల్సిన బాధ్యత. దయచేసి బయటకు వెళ్లండి.. ఓటు వేయండి' అంటూ ట్వీట్ చేసింది అనుష్క శర్మ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News