వైఎస్ వివేకాను ఇబ్బందులు పెడుతున్నదెవరు?

Update: 2016-09-28 11:10 GMT
విపక్ష నేత వైఎస్ జగన్ బాబాయి వివేకానంద రెడ్డికి కడప జిల్లా అధికారుల నుంచి ఇబ్బందులు ఎక్కువయ్యాయట.  వివేకాకు చెందిన భూమిలో అధికారులు నీరు-చెట్టు పనులు చేపట్టారట.. దీంతో తన సొంత భూమిలో ప్రభుత్వ కార్యక్రమం ఎలా చేస్తారంటూ ఆయన అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

కడప జిల్లా ముద్దనూరు మండలంలోని పెద్దదుద్యాల వద్ద వివేకానందరెడ్డికి వ్యవసాయ భూమి ఉంది. అయితే కొందరు టీడీపీ నేతల ప్రోద్బలంతో అధికారులు అక్రమంగా నీరు- చెట్టు పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న వివేకానందరెడ్డి తహసీల్దార్‌ రమ - ఎంపీడీవో మనోహర్‌ వద్దకు వచ్చి జరుగుతున్న తతంగాన్ని వివరించారు. అయితే వారు ఆ వ్యవహారం తమ పరిధిలోకి రాలేదని చెప్పారు. దీంతో ఆయన ఇరిగేషన్ డీఈ రాజన్‌ బాబుతో ఫోన్‌ లో మాట్లాడారు. తన వ్యవసాయ భూమిలో అక్రమంగా పనులు చేయడం ఏమిటని వివేకా ప్రశ్నించారు. అసలు అనుమతులు ఇచ్చిన వారు ఎవరని నిలదీశారు. ఇంత అన్యాయంగా తన భూమిలోకి వచ్చి ఎలా పనులు చేస్తారని వివేకా మండిపడ్డారు. దీంతో సదరు విషయం తనకు తెలియదని చెప్పారు. వెంటనే పనులు ఆపించాలని వివేకా డిమాండ్ చేశారు.

అయితే.... వివేకాను ఇబ్బందిపెట్టేందుకే టీడీపీ నేతలు కొందరు పనిగట్టుకుని అధికారులను రెచ్చగొట్టి ఆ పనిచేయించారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. వివేకా - జగన్ ల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా కూడా వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన్ను ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ నేతలు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News