టీడీపీ సొంత మీడియా సంస్థ సర్వేలేమంటున్నాయి?

Update: 2019-04-13 15:08 GMT
పోలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా ఎవ్వరూ తగ్గడం లేదు. ఎవరికి వారు తమదే విజయం అని అంటూ ఉన్నారు. రాజకీయ పార్టీల నేతలు అలా మాట్లాడుతూ ఉన్నారంటే అదో లెక్క. అయితే..మీడియా సంస్థల టోన్ కూడా అలానే ఉంది. ఇప్పుడు ఎవరికి అనుకూలంగా వ్యవహరించి కూడా ఎవరూ ఫలితాలను ప్రభావితం చేయలేరు.

ఆ విషయం తెలిసి కూడా..మీడియా వర్గాలు మాత్రం తమ తాపత్రాయాన్ని తాము పడుతున్నట్టుగా ఉన్నాయి. ఎవరి సర్వేల్లో వారు విజయం సాధిస్తారనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి బాగా అనుకూలంగా వ్యవహరించే ఒక మీడియా హౌస్ ఆ పార్టీ విజయాన్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంది. అయితే… తెలుగుదేశం పార్టీ మరీ స్వీప్ చేస్తుందని ఆ చానల్ అనడం లేదట.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టైట్ ఫైట్ ఇస్తుందని అది అంటోందని సమాచారం. దాని లెక్కల ప్రకారం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఎమ్మెల్యే సీట్లు దక్కబోతున్నాయట. తెలుగుదేశం పార్టీకి తొంభై సీట్లు దక్కుతాయని దాని అంచనా. మిగతా పదిహేను సీట్లలో జనసేన కొన్నింటిని గెలుస్తుంది, మిగతా వాటిల్లో పోటాపోటీ పరిస్థితి ఉంటుందని..ఆ సర్వే అంచనా  వేసిందట.

తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అనుకూలంగా వ్యవహరించే చానల్ మాట ఇది. ఇక తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన  కొందరు సీనియర్లు కూడా తమ తమ అంతర్గత అంచనాల ప్రకారం టీడీపీకి మరీ వంద సీట్లు దాటే అవకాశం లేదు, తొంభై దరిదాపుల్లోనే రావొచ్చనే అంచనాలను  వ్యక్తం చేరరని టాక్!
Tags:    

Similar News