వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Update: 2021-07-31 12:30 GMT
వైసీపీ ప్రభుత్వంలో మరోసారి అసంతృప్తి జ్వాల ఎగిసిపడింది. అధికార పార్టీ ఎమ్మెల్యే అధికారుల తీరుపై తన అక్కసు వెళ్లగక్కారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.

నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారుల తీరుపై బహిరంగంగానే విమర్శలు చేశారు. కావలి నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ , జాయింట్ కలెక్టర్లు పర్యటించినా తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పర్యటనకు వచ్చి ఏదేదో రాసుకొని వెళ్లిపోతున్నారని మండిపడ్డారు.

ప్రజలకు సేవ చేస్తానని తనను ఎమ్మెల్యేగా గెలిపించారని.. స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందని వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి అన్నారు.తమకు తెలియకుండా.. చెప్పకుండా కావాలిలో అధికారులు వచ్చి తిరగడం ఎంతవరకు సబబు అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వాటి గురించి చెప్పాలన్నా వినడం లేదన్నారు.

ప్రభుత్వం ఇచ్చే గృహాలని పట్టించుకోవడం లేదని.. కావలి నియోజకవర్గ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే రామిరెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ ఆశయాలను అధికారులు పట్టించుకోవడం లేదని.. జిల్లా మంత్రులు వెంటనే దీనిపై స్పందించాలని కోరారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వ , రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.



Tags:    

Similar News