మేం లేచిపోవడం తప్పా! కోర్టుకెక్కిన ఇద్దరమ్మాయిలు..

Update: 2020-09-07 07:30 GMT
వాళ్లిద్దరూ అమ్మాయిలు.. అయితేనేం మనసులు కలిశాయి. ఒకరికొకరు ఎంతో నచ్చారు. ఇద్దరి అభిరుచులు. అభిప్రాయాలు ఒక్కటే. ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ ఈ పాడు సమాజం.. ఈ పెద్దాలున్నారే.. వాళ్లను అస్సలు అర్థం చేసుకోలేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఈ జంట కోర్టుకెక్కింది. స్వలింగ సంపర్కం తప్పు కాదని మనదేశంలోని అత్యున్నత న్యాయస్థానమే తీర్పు చెప్పినప్పడు మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.

గుజరాత్​కు చెందిన పాయల్​, కాంచన 2017లో పోలీస్​ ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. 2018 నుంచి కలిసే ఉంటున్నారు.  కానీ వారికి ఈ సమాజం నుంచి చిత్కారమే ఎదురయ్యిందట. ఇరువురి కుటుంబసభ్యులు వాళ్లను  ఎంతో బెదిరిస్తున్నారట. చంపుతామని హెచ్చరికలు కూడా జారీచేశారట దీంతో విధిలేని సమయంలో కోర్టుకెక్కారు. దీంతో ఈ జంటకు సాయుధ బలగాలతో రక్షణ కల్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

గుజరాత్​లోని మారుమూల గ్రామానికి చెందిన పాయల్​, కాంచన్​ చిన్నప్పటి నుంచే ధైర్యం కలవారు. అందుకే పోలీస్​రంగాన్ని ఎంచుకున్నారు. పోలీస్​ అకాడమీలో వీళ్లద్దరూ ఓకే గదిలో కలిసిఉండేవారు. బయటకొచ్చాక కలిసి బతుకుదామనుకున్నారు. కానీ ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. అయితే ప్రస్తుతం వీళ్లు ఏమంటున్నారంటే.. ఎవరు అడ్డుచెప్పినా మేం మనసు మార్చుకోము. మేం కలిసే బతుకుతాం. ఓ అమ్మాయిని దత్తత తీసుకుంటాం. ఈ కరోనా తగ్గాక దక్షిణభారతదేశం వెళ్లి అక్కడే జీవనం సాగిస్తాం. అంటున్నది ఈ జంట.
Tags:    

Similar News