బండి సంజయ్ అరెస్ట్ ను తట్టుకోలేక యువకుడి ఆత్మహత్యాయత్నం
దుబ్బాక ఎన్నికల వేళ టీఆర్ఎస్, బీజేపీ బిగ్ ఫైట్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల నోట్ల కట్టలు బయటపడడం.. నిరసన కోసం ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే..
బండి సంజయ్ అరెస్ట్ ను తట్టుకోలేని శ్రీనివాస్ అనే యువకుడు హైదరాబాద్ లోని నాంపల్లిలో గల బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా మంటలు చెలరేగడంతో స్థానికులు శ్రీనివాస్ పై నీళ్లు చల్లి మంటలు ఆర్పారు. పార్టీ శ్రేణులు, పోలీసులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పి యువకుడిని వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.
బండి సంజయ్ అరెస్ట్ అయ్యాక జీర్ణించుకోలేకపోయానని అందుకే ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నానని శ్రీనివాస్ తెలిపారు. బండి సంజయ్ కోసం, అరవింద్ కోసం.. రఘునందన్ కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని.. బీజేపీ నేతలను సీఎం కేసీఆర్ ఏమీ చేయలేడని శ్రీనివాస్ కాలిన గాయాలతోనే నినాదాలు చేశారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోని గూడెం శ్రీనివాస్ సొంతూరు. 40శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా తన కోసం యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడని తెలిసి దుబ్బాక ప్రచారంలో ఉన్న బండి సంజయ్ యువకుడిని చూసేందుకు సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు. ఈలోపు అతడికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని హైదరాబాద్ లోని బీజేపీ శ్రేణులను ఆదేశించాడు.
బండి సంజయ్ అరెస్ట్ ను తట్టుకోలేని శ్రీనివాస్ అనే యువకుడు హైదరాబాద్ లోని నాంపల్లిలో గల బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా మంటలు చెలరేగడంతో స్థానికులు శ్రీనివాస్ పై నీళ్లు చల్లి మంటలు ఆర్పారు. పార్టీ శ్రేణులు, పోలీసులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పి యువకుడిని వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.
బండి సంజయ్ అరెస్ట్ అయ్యాక జీర్ణించుకోలేకపోయానని అందుకే ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నానని శ్రీనివాస్ తెలిపారు. బండి సంజయ్ కోసం, అరవింద్ కోసం.. రఘునందన్ కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని.. బీజేపీ నేతలను సీఎం కేసీఆర్ ఏమీ చేయలేడని శ్రీనివాస్ కాలిన గాయాలతోనే నినాదాలు చేశారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోని గూడెం శ్రీనివాస్ సొంతూరు. 40శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా తన కోసం యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడని తెలిసి దుబ్బాక ప్రచారంలో ఉన్న బండి సంజయ్ యువకుడిని చూసేందుకు సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు. ఈలోపు అతడికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని హైదరాబాద్ లోని బీజేపీ శ్రేణులను ఆదేశించాడు.