మరోసారి వార్తల్లో నిలిచిన సోనూ సూద్

Update: 2020-08-13 04:00 GMT
ఇప్పుడు దేశంలో ఈ కరోనా టైంలో ప్రభుత్వాల కంటే కూడా బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఎక్కువగా స్పందిస్తున్నారు.  వలస కూలీలును, కరోనా వేళ ఇబ్బందులు పడ్డ ఉద్యోగ, ఉపాధి, ఆపన్నులను ఆదుకున్న ఆయన ఇప్పటికీ తన సాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇప్పుడు సమస్యల్లో చిక్కుకున్న వారంతా సోనూ సూద్ కే ఫోన్ చేస్తున్నారు. పేదవారికి తోచిన సాయం చేస్తూ తన దాతృత్వాన్ని సోనూ చాటుకుంటున్నారు.

తాజాగా కరోనా నేపథ్యంలో ఫిలిప్పీన్స్ లో చిక్కుకున్న మన భారతీయులను దేశానికి తీసుకువచ్చేందుకు మరోసారి ఆపన్న హస్తం అందించాడు. ఏకంగా ప్రత్యేక విమానం ఏర్పాటు చేశాడు. ఈ విమానం ఆగస్టు 14న మనీలా నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనున్నట్లు సోనూ సూద్ స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించారు.

ఇక కజకస్తాన్ లో చిక్కుకున్న మన తెలుగువారి కోసం కూడా మరొక ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లు సోనూ సూద్ మరో ట్వీట్ లో తెలిపారు. ఆగస్టు 14నే ఇది కూడా కజకస్తాన్ నుంచి బాధితులను తీసుకురానుంది.

ఇలా ఒకేసారి రెండు దేశాల్లోని భారతీయ బాధితులకు సాయం చేస్తూ సోనూ సూద్ మరోసారి వార్తల్లో నిలిచాడు.

    

Tags:    

Similar News