సీన్లోకి సోనియా... కాంగ్రెస్-ఎస్పీ జోడీ రెడీ

Update: 2017-01-22 07:31 GMT
ఉత్తర్ ప్రదేశ్ లో ఎట్టకేలకు కాంగ్రెస్ - ఎస్సీల మధ్య పొత్తు కుదిరింది.  రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తో చేతులు కలిపారు. నిన్నటి వరకూ  సీట్ల పంపిణీ విషయంలో ఏకాభిప్రాయం కుదరక పోగా పొత్తుకు దారులు మూసుకుపోయాయని అంతా భావించారు. కానీ.. కాంగ్రెస్ అధినేత్రి స్వయంగా కల్పించుకోవడంతో సమస్య సద్దుమణిగింది. ఈ ఉదయం అఖిలేష్ తో సోనియా గాంధీ మాట్లాడగా - తొలుత ఆఫర్ చేసిన 99 స్థానాలతో పాటు మరో ఆరు స్థానాలను అధికంగా ఇచ్చేందుకు అఖిలేష్ వర్గం సమ్మతించింది. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.
    
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 105 సీట్లను ఇచ్చేందుకు సమాజ్ వాదీ అంగీకరించింది. తాము 298 స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతామని ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.  కాంగ్రెస్ కు ఆఫర్ చేస్తున్న స్థానాల విషయంలో కొన్ని చోట్ల అభ్యంతరాలున్నాయని, ఆ పార్టీ డిమాండ్ చేస్తున్న కొన్ని చోట్ల తమ పార్టీ బలంగా ఉందని, ఈ స్థానాలపై చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తామని పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
    
అయితే... రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ పొత్తు వల్ల ఎస్పీకి కొంత ఇబ్బంది రావచ్చంటున్నారు. కాంగ్రెస్ కు ఇచ్చే స్థానాల్లోనూ పలుచోట్ల ఎస్పీ బలంగా ఉందని. అక్కడ రెబల్ గా ఎవరైనా పోటీ చేస్తే కష్టమేనని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News