భార్య కాపురానికి రాలేదని అత్తింటి ముందే అల్లుడి ఆత్మహత్య!

Update: 2020-10-14 08:10 GMT
గొడవపడి పుట్టింటికి వెళ్ళిన భార్యను తిరిగి పిలుచుకొని వచ్చేందుకు వెళ్లిన భర్త.. మెట్టినింటికి మళ్లీ వచ్చేది లేదంటూ భార్య కరాఖండిగా చెప్పడంతో మనస్తాపం చెందిన భర్త  అత్తింటి  ముందే ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జిల్లాలోని పెద్దముడియం మండలానికి  చెందిన వ్యక్తి ప్రొద్దుటూరుకు చెందిన యువతిని గత ఏడాది డిసెంబర్ లో వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన రెండు నెలలకే దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టించగా కాపురం పల్లె నుంచి ప్రొద్దుటూరు పట్టణానికి మారిస్తే వస్తానని భార్య చెప్పింది.

 దీంతో అతడు నివాసాన్ని మూడు నెలల కిందట ప్రొద్దుటూరుకు మార్చాడు. అయినా ఆ దంపతుల్లో మార్పు రాలేదు. మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి అత్తగారింటికి వెళ్లిన భర్త కాపురానికి రావాలని భార్యను కోరాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని అత్తగారింటి ముందే పురుగుల మందు తాగాడు. స్థానికులు,  కుటుంబీకులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Tags:    

Similar News