క్రికెట్ కు పాకిన నెపోటిజం: సచిన్ కుమారుడి ఎంపికపై రాద్ధాంతం

Update: 2020-06-28 02:30 GMT
బాలీవుడ్ లో యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహయ్బలవన్మరణంతో నెపోటిజమ్‌ ఇప్పుడు క్రీడా రంగంపచ పడింది. ప్రస్తుతం ఈ రంగంలో కూడా బంధుప్రీతి అభిమానం ఉందని రచ్చ మొదలైంది. బంధుప్రీతి కారణంగా నైపుణ్యం కలిగిన వ్యక్తులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం నెపోటిజమ్ క్రికెట్‌లో కూడా ఉందని ఆరోపణలు మొదయ్యాయి.

దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ ను ఉదహరిస్తూ క్రికెట్‌లో బంధుప్రీతి ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్జున్‌ క్రికెట్ టీమ్ ఎంపికపై రాద్ధాంతం మొదలైంది. నెపోటిజం వలన అర్జున్ ఎంపికయ్యాడని సమాచారం. 2016 అండర్-16 వెస్ట్ జోన్‌ సెలెక్షన్‌లో సచిన్ కుమారుడు అర్జున్ ఒకే ఒక కారణంతో నైపుణ్యం కలిగిన ప్రణవ్ ధనవాడేను పక్కనపెట్టేశారని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఆ విషయంపై ప్రస్తుతం వివాదం రేగుతోంది.

అర్జున్ టెండూల్కర్‌పై ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వెస్ట్ జోన్ టీమ్‌కు ఎంపికయ్యే అర్హతలు ప్రణవ్ ధనవాడే‌కు లేవని, అందుకే అతన్ని పక్కనపెట్టారని తెలిసింది. ముంబై జట్టుకు ఆడిన వ్యక్తినే వెస్ట్ జోన్‌కు ఎంపిక చేస్తారు. ప్రణవ్ వెస్ట్ జోన్ టీమ్ ఎంపికైన తర్వాత ముంబై అండర్-16 జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాతే వరల్డ్ రికార్డు పరుగులు 1009 చేశాడు. అప్పటికే వెస్ట్ జోన్ టీమ్ కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడింది.
Tags:    

Similar News