కరోనా వేళ... ట్వీట్ తో రాహుల్ బుక్కైపోయారు
కాంగ్రెస్ పార్టీ యువనేత - ఆ పార్టీ సారథ్య బాధ్యతలను మోయలేనంటూ కాడిని కింద పడేసిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు మరోమారు బుక్కైపోయారు. రాహుల్ గాంధీకి ఈ తరహాలో బుక్కైపోవడం కొత్త కాకున్నా... ఈ సారి బుక్కైన తీరు మాత్రం ఆసక్తి రేకెత్తించేదే. ఎందుకంటే... ఎప్పుడు బుక్కైనా నెటిజన్లు గానీ - వైరి వర్గాలు గానీ.. రాహుల్ పై ఇప్పుడు ఫైరైన మేర ఏనాడూ విరుచుకుపడలేదనే చెప్పాలి. రాహుల్ జీ మీరు ఇక్కడ ఉండక్కర్లేదు... ఇటలీ వెళ్లిపోండి అంటూ నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేశారంటే.. రాహుల్ గాంధీ ఈ దఫా ఏ మేర బుక్కైపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్న వాదన వినిపిస్తోంది.
అయినా రాహుల్ ఎలా బుక్కైపోయారన్న విషయంలోకి వెళితే... కరోనా వేళ ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ నిర్వహిద్దామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్దతు లభించింది కదా. ఆ సందర్భంగా సాయంత్రం 5 గంటలకు ఇళ్ల నుంచి బయటకు వచ్చి అందరూ చప్పట్లు చరచాలని కూడా మోదీ చేసిన విజ్ఝప్తికి దేశం మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ‘‘దేశంలో కరోనా వైరస్ వ్యాపించకుండా నియంత్రించడంలో విఫలమైన మోడీ ప్రభుత్వం.. ప్రజలను చప్పట్లు కొట్టాలంటూ పురిగొల్పడం ఏమిటి?’’ అంటూ రాహుల్ గాంధీ తన ట్వీట్ లో విమర్శించారు. వెనువెంటనే ఈ ట్వీట్ వైరల్ అయింది.
ఆ వెంటనే రాహుల్ పై సెటైర్లతో పాటు ట్రోలింగ్ మొదలైపోయాయి. పెద్ద సంఖ్యలో నెటిజన్లు రాహుల్ ట్వీట్ ను రీట్వీట్ చేయడంతో పాటుగా సదరు ట్వీట్ లో రాహుల్ ప్రస్తావించిన అంశాన్ని ప్రస్తావిస్తూ... రాహుల్ అజ్ఝానాన్ని ప్రశ్నించేలా సంచలన కామెంట్లు చేయడం మొదలెట్టేశారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా దేశాన్ని రెడీ చేయలేకపోవడం వెనుక యాభై ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ నేతల పాత్ర ఏమీ లేదా రాహుల్ జీ అంటూ ఓ నెటిజన్ ప్రశ్నిస్తే.. చప్పట్ల వెనుక ఉద్దేశం ఎపిడమిక్ పీరియడ్ లో తమ పాత్రని బాధ్యత తో నిర్వహిస్తున్న సిబ్బందికి అభినందలు తెలపడమని.. అది క్కూడా అర్థం చేసుకోలేరా అని మరో నెటిజన్ ప్రశ్నించారు. కొందరైతే తమరు ఇటలీకి వెళ్లిపోండి రాహుల్ జీ అని మరింత సంచలన కామెంట్లు చేశారు. అంతేకాకుండా సంక్షోభ సమయంలో సహకరించకపోయినా సరే కానీ విమర్శలు చేయొద్దని రాహుల్ కు హితవు చెప్పారు. మొత్తంగా సింగిల్ ట్వీట్ తో రాహుల్ దెబ్బైపోయారన్న మాట.
అయినా రాహుల్ ఎలా బుక్కైపోయారన్న విషయంలోకి వెళితే... కరోనా వేళ ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ నిర్వహిద్దామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్దతు లభించింది కదా. ఆ సందర్భంగా సాయంత్రం 5 గంటలకు ఇళ్ల నుంచి బయటకు వచ్చి అందరూ చప్పట్లు చరచాలని కూడా మోదీ చేసిన విజ్ఝప్తికి దేశం మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ‘‘దేశంలో కరోనా వైరస్ వ్యాపించకుండా నియంత్రించడంలో విఫలమైన మోడీ ప్రభుత్వం.. ప్రజలను చప్పట్లు కొట్టాలంటూ పురిగొల్పడం ఏమిటి?’’ అంటూ రాహుల్ గాంధీ తన ట్వీట్ లో విమర్శించారు. వెనువెంటనే ఈ ట్వీట్ వైరల్ అయింది.
ఆ వెంటనే రాహుల్ పై సెటైర్లతో పాటు ట్రోలింగ్ మొదలైపోయాయి. పెద్ద సంఖ్యలో నెటిజన్లు రాహుల్ ట్వీట్ ను రీట్వీట్ చేయడంతో పాటుగా సదరు ట్వీట్ లో రాహుల్ ప్రస్తావించిన అంశాన్ని ప్రస్తావిస్తూ... రాహుల్ అజ్ఝానాన్ని ప్రశ్నించేలా సంచలన కామెంట్లు చేయడం మొదలెట్టేశారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా దేశాన్ని రెడీ చేయలేకపోవడం వెనుక యాభై ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ నేతల పాత్ర ఏమీ లేదా రాహుల్ జీ అంటూ ఓ నెటిజన్ ప్రశ్నిస్తే.. చప్పట్ల వెనుక ఉద్దేశం ఎపిడమిక్ పీరియడ్ లో తమ పాత్రని బాధ్యత తో నిర్వహిస్తున్న సిబ్బందికి అభినందలు తెలపడమని.. అది క్కూడా అర్థం చేసుకోలేరా అని మరో నెటిజన్ ప్రశ్నించారు. కొందరైతే తమరు ఇటలీకి వెళ్లిపోండి రాహుల్ జీ అని మరింత సంచలన కామెంట్లు చేశారు. అంతేకాకుండా సంక్షోభ సమయంలో సహకరించకపోయినా సరే కానీ విమర్శలు చేయొద్దని రాహుల్ కు హితవు చెప్పారు. మొత్తంగా సింగిల్ ట్వీట్ తో రాహుల్ దెబ్బైపోయారన్న మాట.