ఉద్యోగాల పేరుతో అమ్మాయిలకి ఎర .. ఆపై బలవంతంగా ..!

Update: 2020-07-10 00:30 GMT
హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకి వ్యభిచార గృహాలు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యభిచార గృహాలపై పోలీసులు వరుస దాడులు చేస్తున్నారు. కొంతమంది నిర్వాహకులు ఉద్యోగాలు ఇప్పిస్తామని అమ్మాయిలను మభ్యపెట్టి వ్యభిచార రొంపిలోకి దించుతున్న అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. బీహార్‌ కు చెందిన మిథిలేశ్ శర్మ, రజనీశ్ రంజన్, కర్ణాటకకు చెందిన సుఖేశ్ రావణ్ కాంబ్లేలు కలిసి ఉద్యోగాల పేరుతొ ఇతర రాష్ట్రాల యువతులను హైదరాబాద్ కు రప్పిస్తున్నారు.

అలా ఉద్యోగాల పేరుతో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికి ఉద్యోగాలు కల్పించకుండా బలవంతంగా వారిని వ్యభిచారంలోకి దింపుతున్నారు. దానికోసం వీరు యాప్రాల్ లో ఓ  ఫ్లాట్ ను అద్దెకు తీసుకున్నారు. ఈ వ్యవహారం పై సరైన సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు ఈ నెల 7న వ్యభిచార గృహంపై దాడిచేసి యువతులను రక్షించి రజనీశ్, సుఖేశ్, సాయికిరణ్, సిరాజ్ లను అరెస్ట్ చేసారు. కాగా ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు మిథిలేష్ శర్మ కోసం గాలిస్తున్నారు.
Tags:    

Similar News