మోడీని తిట్టిన ప్రకాష్ రాజ్ కు ఇది షాక్

Update: 2019-06-15 10:42 GMT
బీజేపీ అధినేత, ప్రధాని నరేంద్రమోడీ అంటేనే మొన్నటివరకు ప్రకాష్ రాజ్ ఒంటికాలిపై లేచేవాడు.. మోడీ విధానాలను, ఆయన తీరును బహిరంగంగా విమర్శించిన వాళ్లలో దక్షిణాది విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఒకరు. అలాంటి ప్రకాష్ రాజ్ ఈ మధ్య బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీచేశారు. అయితే ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలోనే ఓడిపోయారు..

తాజాగా కశ్మీర్ లోని గుల్మార్గ్ లో ఆయన విహారయాత్రకు వెళ్లగా ఓ అనుకోని సంఘటన చోటు చేసుకుంది. దీనికి తాను కలత చెందానని తాజాగా ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తనను కలిచివేసిందని అన్నారు.

కశ్మీర్ లోని గుల్మార్గ్ లో ప్రకాష్ రాజ్ ఓ హోటల్ లో బయటకు రాగా ఓ మహిళా అభిమాని తన కూతురితో కలిసి ప్రకాష్ రాజ్ తో సెల్ఫీ దిగడానికి అనుమతి కోరిందట.. దీనికి సరేనని సెల్ఫీ ఇచ్చాడట ప్రకాష్ రాజ్. అయితే అప్పుడే వచ్చిన ఆమె భర్త ఆ  ఫొటోలను డిలీట్ చేయాలని.. మోడీని తిట్టిన ఈయనతో సెల్ఫీనా అని భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడట..

ఈ సంఘటన జరగగానే ప్రకాష్ రాజ్..  ఆ మహిళ భర్త వద్దకు వెళ్లి పెళ్లి చేసుకొని.. మీకు కూతురుని ఇచ్చి.. మీతో జీవితాన్ని పంచుకోవడానికి నేనో, మోడీనో కారణం కాదని.. దయచేసి వ్యక్తుల కోసం ఇలా మీ అభిప్రాయాలను రుద్దకండి అని దయచేసి వాళ్ల అభిప్రాయాన్ని గౌరవించండని.. సెలవులను ఆస్వాదించండని చెప్పాను. దీంతో అతడు మౌనంగా ఉండిపోయాడు. ఈ సంఘటన తనను కలిచివేసిందని.. మోడీపై ప్రేమ నాపై కోపానికి దారితీయడం బాగా అనిపించలేదని ప్రకాష్ రాజ్ ట్వీట్ లో పేర్కొన్నారు.

    

Tags:    

Similar News