తేడా వ‌స్తే కోసిపారేయండంటున్న న‌న్న‌ప‌నేని

Update: 2017-05-24 10:57 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్  మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేర‌ళ‌లో ఓ అమ్మాయి త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డుతున్న‌ ఓ  బాబా జననాంగాన్ని కోసేసిన రీతిలోనే..ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితే ఎదురైతే ప్రతి అమ్మాయి అలాగే ప్రవ‌ర్తించాల‌ని న‌న్న‌ప‌నేని పిలుపునిచ్చారు. ఇందుకోసం కత్తులు, చాకులు వెంట తీసుకెళ్లాలని ఆమె సూచించారు. విశాఖ ఏజెన్సీలో గ్యాంగ్ రేప్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన న‌న్న‌ప‌నేని అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

రోజురోజుకు మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌రువు అవుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసిన న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి ఈ విష‌యంలో మ‌హిళ‌లు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కోరారు. కత్తులు, చాకులు రక్షణ కోసం మహిళలు వెంట తీసుకెళ్లాలని కోరారు. మానవమృగాల్లా ఎవరైనా మీదపడితే మర్మాంగాలు కోసేయ్యాలని వ్యాఖ్యానించారు. ఈ మధ్య కేరళలో ఓ రేపిస్ట్ కు ఇలాంటి శాస్తే జరిగిందని చెప్పిన న‌న్న‌ప‌నేని బాధితురాలి తరఫున అక్కడి సీఎం కేసు లేకుండా చేశారని వెల్ల‌డించారు. అమ్మాయిలు చాలా జాగ్ర‌త్తగా ఉండాల‌ని, సోష‌ల్ మీడియాలో అబ్బాయిల‌తో ప‌రిచ‌యాలు పెంచుకొని మోసపోవ‌ద్ద‌ని న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి హిత‌వు ప‌లికారు.
Tags:    

Similar News