ఈ ఊరికి మహాత్మా గాంధీ దేవుడు .. ఎక్కడంటే
ఈ గ్రామ ప్రజలకు మహాత్మాగాంధీ అంటే దేవుడితో సమానం. ఊరి మధ్యలో మహాత్ముడి విగ్రహం ఏర్పాటు చేసి ఆరాధిస్తుంటారు. జయంతి, వర్ధంతితో పాటు పండుగుల సమయంలో నివాళులర్పించి పూజిస్తారు. ఏ శుభకార్యం జరిగినా, మహాత్ముని విగ్రహానికి పూలమాలలతో పూజలు చేస్తారు. అది ఎక్కడో కాదు.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీని దైవంగా భావిస్తామని గ్రామస్థులు అంటున్నారు. ఊరిలో శుభకార్యలు, వివాహాలకు, సంతానం కలిగిన గాంధీ విగ్రహానికి అభిషేకం చేసి కొబ్బరికాయ కొట్టి పూజిస్తారు.
వర్షాల కోసం గ్రామ దేవతలకు అంతటా జలాభిషేకాలు చేస్తే... నర్సింగపూర్ లో మాత్రం వర్షాల కోసం గాంధీకి జలాభిషేకం చేస్తారు.
నర్సింగపూర్ గ్రామ నడిబొడ్డున 1961 నవంబర్ 1న గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పట్నుంచి మహాత్మను దేవునిలా కొలుస్తూ, నిత్య పూజలు చేస్తున్నారు గ్రామస్తులు. నాటి నుంచి నేటి వరకు అదే సాంప్రదాయం కొనసాగుతోంది. గాంధీని దేవునితో సమానంగా పూజిస్తూ గౌరవిస్తున్నారు. గాంధీజీ జయంతి. వర్ధంతి రోజుల్లో అంతటా పూజలు చేస్తే, నర్సింగపూర్ అందుకు భిన్నం. గ్రామంలో ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా, గాంధీకి పూజలు చేసిన తరవాతే ప్రారంభిస్తామంటున్నారు నర్సింగపూర్ వాసులు. వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు అంతటా జలాభిషేకాలు చేస్తే నర్సింగపూర్ లో మాత్రం వర్షాలు కురవాలని గాంధీకి జలాభిషేకం చేస్తారు.
తరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని తాము పాటిస్తున్నామని చెబుతున్నారు గ్రామస్తులు. డిచ్ పల్లి మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ జనాభా 1274. గ్రామం చిన్నదైనా.. గాంధీని గౌరవించే విషయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. 1961 నవంబర్ 1న గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.
వర్షాల కోసం గ్రామ దేవతలకు అంతటా జలాభిషేకాలు చేస్తే... నర్సింగపూర్ లో మాత్రం వర్షాల కోసం గాంధీకి జలాభిషేకం చేస్తారు.
నర్సింగపూర్ గ్రామ నడిబొడ్డున 1961 నవంబర్ 1న గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పట్నుంచి మహాత్మను దేవునిలా కొలుస్తూ, నిత్య పూజలు చేస్తున్నారు గ్రామస్తులు. నాటి నుంచి నేటి వరకు అదే సాంప్రదాయం కొనసాగుతోంది. గాంధీని దేవునితో సమానంగా పూజిస్తూ గౌరవిస్తున్నారు. గాంధీజీ జయంతి. వర్ధంతి రోజుల్లో అంతటా పూజలు చేస్తే, నర్సింగపూర్ అందుకు భిన్నం. గ్రామంలో ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా, గాంధీకి పూజలు చేసిన తరవాతే ప్రారంభిస్తామంటున్నారు నర్సింగపూర్ వాసులు. వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు అంతటా జలాభిషేకాలు చేస్తే నర్సింగపూర్ లో మాత్రం వర్షాలు కురవాలని గాంధీకి జలాభిషేకం చేస్తారు.
తరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని తాము పాటిస్తున్నామని చెబుతున్నారు గ్రామస్తులు. డిచ్ పల్లి మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ జనాభా 1274. గ్రామం చిన్నదైనా.. గాంధీని గౌరవించే విషయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. 1961 నవంబర్ 1న గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.