శ్రీవారి సేవలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఆయన శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దైవ కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. దైవం ముందు ఎవరైనా తలదించాల్సిందే అనే ఆయన తాజాగా తిరుమల శ్రీవారిని ఫ్యామిలీతో సహా వచ్చి దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.. వేద పండితులు ఆశీర్వచనాలు పలికి శేషవస్త్రంతో సత్కరించారు. ఆ తరువాత అయన ఆలయం ఎదురుగా ఉన్న నారద నీరాజనం మండపం లో నిర్వహించిన సుందరకాండ పారాయణం లో పాల్గొన్నారు. శుక్రవారం రాత్రే చౌహన్ కుటుంబం తిరుమలకు చేరుకోగా ఆలయ ఈవో, అధికారులు స్వాగతం పలికారు దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనం అనంతరం అయన మాట్లాడుతూ ..తిరుమల వెంకన్నను దర్శించుకోవడం ఆనందం గా ఉందని, ఈ వైరస్ నుండి త్వరగా విముక్తి పొందాలని స్వామివారిని కోరుకున్నాను అన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. దేశ రక్షణ కోసం పోరాడే సైనికులకు మరింత శక్తిని ప్రసాదించాలిన ప్రార్థించాను అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కరోనాపై బలంగా పోరాడుతున్నాము అన్నారు
దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.. వేద పండితులు ఆశీర్వచనాలు పలికి శేషవస్త్రంతో సత్కరించారు. ఆ తరువాత అయన ఆలయం ఎదురుగా ఉన్న నారద నీరాజనం మండపం లో నిర్వహించిన సుందరకాండ పారాయణం లో పాల్గొన్నారు. శుక్రవారం రాత్రే చౌహన్ కుటుంబం తిరుమలకు చేరుకోగా ఆలయ ఈవో, అధికారులు స్వాగతం పలికారు దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనం అనంతరం అయన మాట్లాడుతూ ..తిరుమల వెంకన్నను దర్శించుకోవడం ఆనందం గా ఉందని, ఈ వైరస్ నుండి త్వరగా విముక్తి పొందాలని స్వామివారిని కోరుకున్నాను అన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. దేశ రక్షణ కోసం పోరాడే సైనికులకు మరింత శక్తిని ప్రసాదించాలిన ప్రార్థించాను అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కరోనాపై బలంగా పోరాడుతున్నాము అన్నారు