ప్రభాస్ ఫాన్స్ ట్వీట్ కి కెటిఆర్ స్పందించాడు

Update: 2017-03-21 09:12 GMT
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఆయనకు ట్విట్టర్లో చాలామంది తమ సమస్యల గురించి చెబుతుంటారు. కేటీఆర్ పేరును ట్యాగ్ చేసి ఏవైనా ఇష్యూస్ ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తుంటారు. కేటీఆర్ కూడా చాలా సమస్యలపై స్పందించి సత్వర చర్యలకు ఆదేశిస్తుంటారు. తాజాగా ఆయన ఓ చిరు వ్యాపారి కోసం స్పందించి అందరి మనసు దోచారు.

తాజాగా హైదరాబాద్ లోని ఉప్పల్ దగ్గర నల్ల చెరువు ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఓ చిరు వ్యాపారిపై వారు దాడి చేశారు. ఈ సంఘటన జరిగినపుడు ఎవరో మొబైల్ తో మొత్తం వ్యవహారాన్ని వీడియో తీశారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోలీసుల దాడి ఘటన దృశ్యాలు ఆన్ లైన్లో వైరల్ అయ్యాయి. ఒక నెటిజన్ (ప్రభాస్ ఫాన్స్ అని ) ఈ వీడియోను ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చాడు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ప్రశ్నించాడు. దీనిపై మంత్రి కేటీఆర్ కూడా వెంటనే స్పందించారు.

తెలంగాణ డీజీపీ వెంటనే ఈ వ్యవహారంపై దృష్టిపెట్టాలని.. ఆయన్ని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ పేర్కొన్నారు. సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటామని కేటీఆర్ వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలతో సంబంధాలు కలిగి ఉండే కిందిస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ డీజీపీకి కేటీఆర్ సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News