లోకేశ్, మంత్రి జవహార్ మధ్య జరిగిందేమిటి?

Update: 2017-04-23 06:47 GMT
సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక విషయం బాగా స్ప్రెడ్ అవుతోంది. సీఎం కుమారుడు, మంత్రి లోకేశ్ తనతో పాటు మొన్ననే కొత్త మంత్రి పదవి పొందిన కేఎస్ జవహర్ ను అవమానించారన్నది దాని సారాంశం. లోకేశ్ ను కలవడానికి ఆయన ఛాంబర్ వద్దకు జవహర్ వెళ్లగా గంట పాటు బయట వెయిట్ చేయించారని ప్రచారం జరుగుతోంది. దాంతో జవహర్ నొచ్చుకున్నారని... మంత్రిగా తాను కూడా లోకేశ్ మాదిరిగానే కొత్త అయినా నాయకుడిగా ఎంతో సీనియర్ కావడంతో ఆయన ఈ విషయంలో బాధపడ్డారంటూ కథనాలు వస్తున్నాయి.
    
అయితే... దీనిపై స్పందించిన జవహర్ అదేమీ లేదని చెబుతున్నారు. లోకేశ్ తననేమీ అవమానించలేదంటూనే చాంబర్ ముందు వెయిట్ చేయడం మాత్రం వాస్తవమేనని చెప్పారు. గంట సేపు కాకున్నా 10 నిమిషాలు వెయిట్ చేసినట్లు చెప్పారు. అసలేం జరిగిందో ఆయన చెప్పుకొచ్చారు.
    
తాను మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన రోజున ఆ ఘటన జరిగిందని... ప్రమాణ స్వీకారానికి  మరో గంట సమయం ఉన్న నేపథ్యంలో... తన ఛాంబర్ ముందే లోకేష్ ఛాంబర్ కూడా ఉండటంతో ఆయనను కలిసేందుకు వెళ్లానని... ఆ సమయంలో ఆయన ఐటీ శాఖ అధికారులతో బిజీగా ఉన్నారని... దాంతో, తాను వచ్చినట్టు లోకేష్ కు చెప్పమని అక్కడున్న సిబ్బందికి చెప్పానని తెలిపారు. ఆ సమాచారం లోకేష్ కు చేరడానికి 10 నిమిషాల సమయం పట్టిందని... సమాచారం తెలుసుకున్న వెంటనే తనను లోపలకు రమ్మని చెప్పారని ఆయన అన్నారు.  కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఈ సమయం పట్టిందని చెప్పారు. తాను ఛాంబర్ లో ఉన్నప్పుడు... బయట ఎవరు ఉన్నారో తనకు మాత్రం ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. లోకేష్ విషయంలో కూడా ఇదే జరిగిందని... తనను ఆయన అవమానించలేదని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News