సుమలత నూతన గృహం.. అతిథిగా యష్

Update: 2019-05-22 08:31 GMT
పోయినేడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన 'కేజీఎఫ్: చాప్టర్ 1' 'బాహుబలి' బాటలో మొత్తం ఇండియనే షేక్ చేసింది.  మరీ 'బాహుబలి' రేంజ్ కాదు కానీ కన్నడ ఇండస్ట్రీ మార్కెట్ పరంగా  చూసుకుంటే మాత్రం 'కేజీఎఫ్' సంచలనం సాధారణమైనది కాదు.  ఈ సినిమా విజయంతో హీరో యష్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు.  దీంతో యష్ కు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ పై ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

తాజాగా యష్ - రాధిక పండిట్ దంపతులు సీనియర్ తెలుగు నటి సుమలత గృహప్రవేశానికి హాజరయ్యారు. బెంగుళూరు లోని జేపీ సిటీలో సుమలత కొత్తగా ఇల్లు కట్టుకున్నారు.  సుమలత భర్త అంబరీష్ ఈ ఇంటిని ఎంతో ప్రేమగా నిర్మించుకున్నారట. ఇకపై ఈ ఇంట్లోనే ఉండాలని అయనకు ఆలోచన ఉండేదట. కానీ ఆయన ఈ ఇల్లునిర్మాణంలో ఉండగానే కాలం చేయడంతో ఇపుడు సుమలత.. తన కుమారుడితో కలిసి గృహప్రవేశ కార్యక్రమాన్ని జరుపుకున్నారు.  యష్ ఫ్యామిలీ మొదటి నుంచి అంబరీష్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే ఈమధ్య సుమలత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు యష్ స్వయంగా ఆమెకోసం ప్రచారం నిర్వహించారు.

తాజాగా గృహప్రవేశం సమయంలో యష్ దంపతులు సుమలతతో మాట్లాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  యష్ ప్రస్తుతం 'కెజీఎఫ్: చాప్టర్ 2' షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.  ఈ ఫోటోలో యష్ అదే గెటప్ లో కనిపిస్తున్నాడు.


Tags:    

Similar News