బీజేపీ గూటికి పవన్ కళ్యాణ్ .. ఆ నాలుగు పెళ్లిళ్లే !

Update: 2019-12-04 05:52 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ? ఎప్పుడు ఎవరిపై విమర్శలు చేస్తారో ..ఎప్పుడు ప్రశంసలు కురిపిస్తారో ఎవరికీ అర్థం కావడంలేదు. పార్టీ పెట్టిన కొత్తలో బీజేపీ , టీడీపీ లతో కలిసి ముందుసాగిన పవన్ ..ఎన్నికల తరువాత కొన్ని రోజులకి టీడీపీ పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆ తరువాత బీజేపీ పై , ప్రధాని మోడీ పై కూడా తీవ్రమైన విమర్శలు గుప్పించారు. దీనితో పవన్ కళ్యాణ్ టీడీపీ , బీజేపీ తో పూర్తిగా బంధం తెంచుకున్నారు అని అనుకున్నారు.

కానీ , ఈ మధ్య పవన్ చేసే కొన్ని వ్యాఖ్యల వల్ల మళ్లీ పవన్ కళ్యాణ్ తన మిత్రుల తో కలిసి పోతోబోతున్నాడా అని అందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల తరువాత వైసీపీ కి పూర్తిగా వ్యతిరేకంగా మారి ..టీడీపీ కి మద్దతుగా మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం పై , సీఎం జగన్ పై ఎన్నో ఆరోపణలు చేసాడు. అలాగే ప్రస్తుతం రాయలసీమ పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటన లో భాగంగా తాజాగా పవన్ బీజేపీ అగ్రనేతలైన అమిత్ షా , ప్రధాని మోడీ లపై ప్రశంసలు కురిపించారు. అమిత్ షా .. ఇతర పార్టీ నేతలని ఎలా డీల్ చేయాలో సరిగ్గా తెలుసు అని , అలాంటి నేతలే దేశానికి కరెక్ట్ అంటూ చెప్పారు.

పవన్ చేసిన ఈ వ్యాఖ్యల పై ఏపీ మంత్రి పేర్ని నాని  సంచలన వ్యాఖ్యలు చేసారు. అతి త్వరలో జనసేన బీజేపీ లో కలవబోతుంది అనడానికి పవన్ మాట్లాడిన మాటలే ఒక నిదర్శనం అంటూ అన్నారు. అలాగే మంత్రి మాట్లాడుతూ .. ప్రజల మద్దతుతోనే వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది అని , మా ప్రభుత్వానికి పవన్ మద్దతు అవసరం లేదు అని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్ల పై మరోసారి నాని హాట్ కామెంట్స్ చేసారు. పవన్ నాలుగు పెళ్లిళ్ల వల్ల ప్రజలలోకి తప్పుడు సంకేతాలు పోతున్నాయని అని , కానీ పవన్ అది పట్టించుకోకుండా ..సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News