భర్త లేకపోవడంతో ఇద్దరితో అక్రమ సంబంధం ... ఆ తర్వాత ఏమైందంటే !

Update: 2020-11-12 08:10 GMT
వివాహేతర సంబంధం... వీటివల్ల ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి, ఎంతోమంది అన్యాయంగా మృత్యువాత పడుతున్నారు. సమాజంలో  వివాహేతర బంధం పెట్టుకున్న వారి పరిస్థితి ఎలా ఉందొ ఓ వైపు చూస్తూనే , మరోవైపు ఆ బంధాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ,  వివాహేతర బంధం ఎప్పటికైనా  అనార్థాలకు దారి తీస్తుందని మరోసారి ఓ ఘటన నిరూపించింది. తాజాగా యాదాద్రి జిల్లాలో ఓ మహిళ హత్య కలకలం రేపుతోంది. జిల్లాలోని భువనగిరి బై పాస్ రోడ్డు పక్కన గుట్టల్లో లక్ష్మి  అనే మహిళ దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. మహిళను హత్య చేసిన అనంతరం ప్రియుడు కుమార్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే ... జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్ద మండర్ గ్రామానికి చెందిన లక్ష్మీ భర్త చనిపోవడంతో కుమార్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. కుమార్ క్యాబ్ డ్రైవర్ ‌గా పనిచేస్తున్నాడు. ఇదే సమయంలో లక్ష్మీ కుమార్ ‌తో పాటు విజయ్ అనే మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. మహబూబ్ అంగర చెందిన విజయ్ అనే యువకుడితో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త క్రమంగా అక్రమ సంబంధంగా మారింది.దీంతో ఈ విషయం తెలిసిన కుమార్ ఆగ్రహంతో ఊగిపోయాడు. తనతో పాటు విజయ్‌ తో కూడా లక్ష్మీ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో సహించలేకపోయాడు. దీంతో ఆమెను ఎలా అయిన హత్య చేయాలని ప్లాన్ వేశాడు. లక్ష్మిని బ్లెడ్ తో గొంతుకోసి హత్య చేశాడు. హత్య అనంతరం కుమార్ పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News