మరో మూడేళ్లలో పట్టాలెక్కనున్న 44 వందే భారత్ ట్రైన్లు !

Update: 2020-07-29 05:45 GMT
రైలు ప్రయాణాన్నిమరింత వేగవంతం, మరింత సౌకర్యవంతం చేయడడానికి రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  కార్యక్రమమే వందే భారత్ ఎక్స్ ప్రెస్. ఈ  ప్రాజెక్టు 2022 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభం కాబోతుంది. అత్యాధునిక హంగులతో తయారయ్యే ఈ రైళ్లు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి రానున్నాయి అని సమాచారం. రాబోయే మూడేళ్లలో 44 ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైళ్లను పట్టాలపై పరుగులు పెట్టించనున్నట్లు భారత రైల్వే శాఖ మంగళవారం ప్రకటించింది.

దేశీయ తొలి సెమీ హైస్పీడ్‌ రైలు వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లను మూడు యూనిట్లలో తయారు చేసి వాటిని 2022 నాటికి రైలు నెట్‌ వర్క్ ‌లో చేర్చనున్నట్లు వెల్లడించింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపుర్తాలా, మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ రాయ్‌బరేలి, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై లలో ఈ వందే భారత్ రైళ్ల నిర్మాణం ఒకేసారి జరుగుతుందని రైల్వే బోర్డు చైర్మన్ వికె యాదవ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కొన్ని నెలల క్రితం మూడు కర్మాగారాల్లో ఈ రైళ్లను తయారు చేస్తామని నిర్ణయం తీసుకున్నట్లు దీనిద్వారా రైళ్ల నిర్మాణ సమయాన్ని తగ్గించవచ్చు అని తెలిపారు. 44 వందే భారత్‌ రైళ్లు వచ్చే రెండు మూడేళ్లలో పట్టాలపైకి ఎక్కనున్నాయని తెలిపారు.

టెండర్‌ ఖరారు చేయడంతో ఖచ్చితమైన సమయానికి రైళ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. అందులో భాగంగా మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైలుకు వచ్చిన స్పందనను చూసి రైళ్ల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. మొత్తంగా 2020-21 నాటికి 240 బోగీలతో 15 రైళ్లను సిద్ధం చేయాలి అని నిర్ణయించారు.   మొదటి రెండు వందే భారత్‌ రైళ్లను తయారు చేసిన ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ   రైల్వే బోర్డుకు వాటి సేవలను వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు 28 నెలలతోపాటు అదనంగా ఆరు నెలల సమయం పట్టిందని, దాని అంచనాల ప్రకారం  44 రైళ్ల తయారీని పూర్తి చేయడానికి 78 నెలలు పట్టనున్న్నట్లు తెలిపారు. 
Tags:    

Similar News