161 ఏళ్ల గణిత చిక్కుముడి తొలగింది !
19వ శతాబ్దంలో వెలుగులోకి వచ్చి, ఈ శతాబ్దంలో అతిపెద్ద గణిత సమస్యగా నిలిచిన రైమాన్ హైపోథిసిస్ ను హైదరాబాద్ కు చెందిన శ్రీనిధి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాథ్స్ ప్రొఫెసర్ డాక్టర్ కుమార్ ఈశ్వరన్ సాల్వ్ చేశారు. ఈ సమస్య సాధన కోసం ప్రపంచం 161 సంవత్సరాలు నిరీక్షించడం విశేషం. ఈ శతాబ్దపు టాప్ 10 గణిత సమస్యల్లో 'రైమాన్ హైపోథిసిస్' అగ్రస్థానంలో ఉంది. రీమన్ హైపోథీసిస్ పాథమికంగా ప్రధాన సంఖ్యలను లెక్కించడంలో సహాయపడుతుంది. ఈ పద్ధతిలో పెద్ద సంఖ్యలను సృష్టించవచ్చు.ఇక ఈ సమస్యను పరిష్కరిస్తే మిలియన్ డాలర్ల బహుమతిని ఇస్తామని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీతో పాటు క్లే మ్యాథమేటిక్స్ ఇనిస్టిట్యూట్ కూడ ప్రకటించింది.
తన తాజా పరిశోధనపై మాట్లాడిన డాక్టర్ ఈశ్వరన్, ఈ ఫార్ములాను ఛేదించే రుజువును 2016లోనే నేను అందించాను. 19వ శతాబ్దంలో గొప్ప గణిత శాస్త్రవేత్తగా పేరున్న జార్జ్ ఫ్రెడ్రిక్ బెర్నార్డ్ రైమాన్ ఈ ఫార్ములాను తొలిసారిగా వెలుగులోకి తెచ్చారు. నేను దీనిపై ఎన్నో వారాలు పని చేశాను. 2018-19లో ఈ విషయంపై ఎన్నో ప్రసంగాలు కూడా చేశాను అని అన్నారు. వాస్తవానికి రైమాన్ హైపోథిసిస్ ప్రధాన సంఖ్యలను ఎలా వర్గీకరించాలన్న విషయమై ఎంతో సులభతర మార్గాన్ని చూపుతుంది. అయితే, అది ఎలాగన్న విషయం మాత్రం పూర్తి సస్పెన్స్. దీన్ని సాల్వ్ చేసేందుకు ఎంతో మంది ప్రయత్నించినా, లక్ష్యాన్ని మాత్రం చేరలేకపోయారు. అయితే, ఓ క్రమ పద్ధతిలో పరిశీలిస్తూ ముందుకుసాగడంతో పాటు, కేవలం సంఖ్యాశాస్త్రాన్ని మాత్రమే నమ్మకుండా మిగతా మార్గాలను కూడా ఎంచుకుని దీనికి పరిష్కారాన్ని కనుగొన్నామని డాక్టర్ ఈశ్వరన్ తెలిపారు.
ప్రఖ్యాత జర్మనీ గణితశాస్త్రవేత్త జార్జ్ ఫ్రెడ్రిచ్ బెర్న్హార్డ్ రీమన్ (1826-1866) ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసి జెటా ఫంక్షన్ సాయంతో ప్రధాన సంఖ్యల సంఖ్యను గుర్తించవచ్చని ప్రతిపాదించారు. జెటా ఫంక్షన్ శూన్యస్థానాలు x = 1/2 అనే రేఖ మీద గుమిగూడి ఉంటాయి’ అని రీమన్ ప్రతిపాదించారు. దీనినే రీమన్ దత్తాంశం..రీమన్ హైపోథీసిస్ అని పిలుస్తారు. కాగా, డాక్టర్ ఈశ్వరన్ సాధించిన ఈ విజయాన్ని ఎంతో మంది ఇప్పటికే గుర్తించారు. నిపుణుల కమిటీలు ఆయన సూత్రాలను పరిశీలించి, రైమాన్ హైపోథిసిస్ పై ఈశ్వరన్ గెలిచారని ప్రకటించారు. ఈ కమిటీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 1,200 మంది గణిత నిపుణులు కుమార్ ఈశ్వరన్ సిద్ధాంతాన్ని సమీక్షించారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ఏడాది మే 16న నిపుణుల కమిటీ సమావేశమై కుమార్ ఈశ్వరన్ ఆధారాలు రీమన్ దత్తాంశాన్ని నిరూపిస్తున్నాయని ప్రకటించింది. ఈ ఘనత సాధించడం పట్ల కుమార్ ఈశ్వరన్ ను శ్రీనిధి గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ మహె ప్రశంసించారు.
తన తాజా పరిశోధనపై మాట్లాడిన డాక్టర్ ఈశ్వరన్, ఈ ఫార్ములాను ఛేదించే రుజువును 2016లోనే నేను అందించాను. 19వ శతాబ్దంలో గొప్ప గణిత శాస్త్రవేత్తగా పేరున్న జార్జ్ ఫ్రెడ్రిక్ బెర్నార్డ్ రైమాన్ ఈ ఫార్ములాను తొలిసారిగా వెలుగులోకి తెచ్చారు. నేను దీనిపై ఎన్నో వారాలు పని చేశాను. 2018-19లో ఈ విషయంపై ఎన్నో ప్రసంగాలు కూడా చేశాను అని అన్నారు. వాస్తవానికి రైమాన్ హైపోథిసిస్ ప్రధాన సంఖ్యలను ఎలా వర్గీకరించాలన్న విషయమై ఎంతో సులభతర మార్గాన్ని చూపుతుంది. అయితే, అది ఎలాగన్న విషయం మాత్రం పూర్తి సస్పెన్స్. దీన్ని సాల్వ్ చేసేందుకు ఎంతో మంది ప్రయత్నించినా, లక్ష్యాన్ని మాత్రం చేరలేకపోయారు. అయితే, ఓ క్రమ పద్ధతిలో పరిశీలిస్తూ ముందుకుసాగడంతో పాటు, కేవలం సంఖ్యాశాస్త్రాన్ని మాత్రమే నమ్మకుండా మిగతా మార్గాలను కూడా ఎంచుకుని దీనికి పరిష్కారాన్ని కనుగొన్నామని డాక్టర్ ఈశ్వరన్ తెలిపారు.
ప్రఖ్యాత జర్మనీ గణితశాస్త్రవేత్త జార్జ్ ఫ్రెడ్రిచ్ బెర్న్హార్డ్ రీమన్ (1826-1866) ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసి జెటా ఫంక్షన్ సాయంతో ప్రధాన సంఖ్యల సంఖ్యను గుర్తించవచ్చని ప్రతిపాదించారు. జెటా ఫంక్షన్ శూన్యస్థానాలు x = 1/2 అనే రేఖ మీద గుమిగూడి ఉంటాయి’ అని రీమన్ ప్రతిపాదించారు. దీనినే రీమన్ దత్తాంశం..రీమన్ హైపోథీసిస్ అని పిలుస్తారు. కాగా, డాక్టర్ ఈశ్వరన్ సాధించిన ఈ విజయాన్ని ఎంతో మంది ఇప్పటికే గుర్తించారు. నిపుణుల కమిటీలు ఆయన సూత్రాలను పరిశీలించి, రైమాన్ హైపోథిసిస్ పై ఈశ్వరన్ గెలిచారని ప్రకటించారు. ఈ కమిటీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 1,200 మంది గణిత నిపుణులు కుమార్ ఈశ్వరన్ సిద్ధాంతాన్ని సమీక్షించారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ఏడాది మే 16న నిపుణుల కమిటీ సమావేశమై కుమార్ ఈశ్వరన్ ఆధారాలు రీమన్ దత్తాంశాన్ని నిరూపిస్తున్నాయని ప్రకటించింది. ఈ ఘనత సాధించడం పట్ల కుమార్ ఈశ్వరన్ ను శ్రీనిధి గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ మహె ప్రశంసించారు.