నీట్ పరీక్షలో భారీ కుంభకోణం...డీల్ ఎంతంటే?
మెడికల్ కాలేజీల్లో మెడిసిన్ అడ్మిషన్స్ కోసం నిర్వహించే నీట్ పరీక్షలకు సంబంధించి భారీ కుంభకోణానికి పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. మహారాష్ట్రలోని ఆర్కే ఎడ్యుకేషన్ కెరీర్ గైడెన్స్ అనే కోచింగ్ సెంటర్ నిర్వాహకులే ఈ కుంభకోణానికి తెరతీసినట్టు గుర్తించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ నేరానికి పాల్పడుతున్న ముఠాసభ్యులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తోంది. కుంభకోణం.. ఈ స్కామ్ ఇప్పుడు దేశాన్ని షేక్ చేస్తోంది. ఎందుకంటే.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ను మార్చురీలోకి పంపేస్థాయికి చేరుకుంది. ఈ కరోనా సమయంలో నిద్రహారాలు మాని చదివి మెడికల్ సీటు పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఈ కుంభకోణం దెబ్బకి మళ్లీ బుక్స్ పట్టి మళ్లీ చదవాలేమో.
దేశ వ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే సంస్థ ద్వారానే ప్రధాన ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి. మెడికల్ నుంచి NET, గేట్ వరకు ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తుంది. మొదట్లో పక్కాగా నిర్వహించినా కొద్ది రోజులకే సంస్థ కీర్తి అబాసు పాలవుతోంది. కష్టపడి చదువుకున్న విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. ఇప్పటి వరకు ఎంతో మంది స్టూడెంట్స్ లైఫ్ లను నాశనం చేసింది. ఇప్పుడు తాజాగా మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇంతకు ఈ పరీక్ష ఉంటుందా, రద్దు చేస్తారా ఉంటే కాపీయింగ్ చేసిన విద్యార్థులతో పోల్చితే మామూలు విద్యార్థుల గతి ఏంటి ఏళ్లుగా బుక్స్ తో కుస్తీ పడి చదివిన వారి భవిష్యత్ ఏంటి అన్న ప్రశ్నలు వెంటాడుతున్నాయి.
ఈ నెల 12న దేశ వ్యాప్తంగా నీట్-2021 పరీక్ష జరిగింది. ఆ తర్వాత ఈ పరీక్షపై ఎన్నోఎన్నో అనుమానాలు, అపవాదాలు తెరమీదకు వచ్చాయి. వాటికి బలం చేకూర్చుతూ రాజస్తాన్ రాష్ట్రం జైపూర్ లో స్కామ్ బాంబ్ పేలింది. అది కాస్త దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.నీట్ పరీక్ష మొదలైన అరగంటలోనే వాట్సాప్ ద్వారా లీక్ అయినట్టు గుర్తించారు. రాజస్తాన్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పరీక్ష కేంద్రం నుంచి నీట్ కోచింగ్ సెంటర్ ఓనర్ నవ రత్న స్వామి ఈ యవ్వారం నడిపినట్టు పోలీసుల విచారణలో తేలింది. అటు తర్వాత జరిపిన విచారణలో అభ్యర్థి ధేశ్వరియాదవ్తో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసుల విచారణలో పలు సంచలనాలు వెలుగు చూశాయి. ఒక్కో అభ్యర్థి నుంచి మెడికల్ మాఫియా 35 లక్షలతో డీల్ ఓకే చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనంతటికి మూల కేంద్రం నీట్ పరీక్ష కేంద్రం నుంచే జరిగినట్టు గుర్తించారు. ఎగ్జామ్ సెంటర్లోని ఇన్విజిలేటర్ ద్వారా క్వశ్చన్ పేపర్ ను ఫోటో తీసి వాట్సాప్ ద్వారా మెడికల్ మాఫియాకు పంపారు. అప్పటికే రెడీగా ఉన్న నిపుణులు క్వశ్చన్స్కు ఆన్సర్ ను గుర్తించి.. మళ్లీ ఆన్సర్ షీట్ ను పరీక్ష కేంద్రానికి పంపించారు. పరీక్ష ముగిసే సమయంలో ఆన్సర్ తో కూడుకున్న OMR షీట్ ను అభ్యర్థులకు ఇచ్చి పరీక్ష రాయించారని తేలింది.
ఇటు మహారాష్ట్రలోనూ ఇదే ఇష్యూ ప్రకంపనలు సృష్టిస్తోంది. రంగంలోకి దిగిన CBI కోచింట్ సెంటర్స్, విద్యార్థుల నిర్వాహకాన్ని రట్టు చేసింది. కొంత మందిపై కేసు కూడా నమోదు చేసింది. అసలు విద్యార్థుల స్థానంలో మరో విద్యార్థితో పరీక్ష రాయించినట్టు తేలింది. నీట్ పరీక్షలకు హాజరు కావాల్సిన అభ్యర్థికి బదులుగా మరొక తెలివైన మెడిసిన్ విద్యార్థి చేత పరీక్ష రాయించి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మెడిసిన్ సీటు ఇప్పించేలా ఆ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఆశావహులైన అభ్యర్థుల నుంచి ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నట్టు సీబీఐ దర్యాప్తులో తేలింది. కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పరిమళ్ కొత్పల్లివార్తో పాటు మోసపూరితంగా నీట్ పరీక్షలు రాసి మెడిసిన్ సీటు పొందాలని కుట్రపన్నిన పలువురు విద్యార్థులపై కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసినట్టు సీబీఐ అధికారి తెలిపారు.
కుంభకోణంలో భాగంగా తమను ఆశ్రయించిన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పరిమళ్ కొత్పల్లివార్ పోస్ట్ డేటెడ్ చెక్కులు తీసుకున్నట్టు తేలింది. ఒప్పందం ప్రకారమే పని పూర్తయ్యాక మిగతా బ్యాలెన్స్ చెల్లించేందుకుగానూ షూరిటీగా విద్యార్థుల టెన్త్, ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్లను కోచింగ్ సెంటర్ నిర్వాహకులు తీసుకున్నారని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్టు సమాచారం. నీట్ పరీక్షలు రాసే విద్యార్థుల పరీక్ష ఐడీ, పాస్వర్డ్ల వివరాలు సేకరించి ఎవ్వరికీ అనుమానం రాకుండా అభ్యర్థుల ఫొటోలు, వారి స్థానంలో పరీక్షలు రాసే నకిలీ అభ్యర్థుల ఫొటోలను మార్ఫింగ్ చేసి మరీ మోసాలకు పాల్పడుతున్నారు. స్పష్టమైన సమాచారంతోనే ఈ ముఠాను అరెస్ట్ చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత NTA సంస్థపై విద్యార్థుల్లో నమ్మకం పోయింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థను నాట్ ట్రూత్ వర్త్ ఏజెన్సీగా మారిందని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే సంస్థ ద్వారానే ప్రధాన ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి. మెడికల్ నుంచి NET, గేట్ వరకు ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తుంది. మొదట్లో పక్కాగా నిర్వహించినా కొద్ది రోజులకే సంస్థ కీర్తి అబాసు పాలవుతోంది. కష్టపడి చదువుకున్న విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. ఇప్పటి వరకు ఎంతో మంది స్టూడెంట్స్ లైఫ్ లను నాశనం చేసింది. ఇప్పుడు తాజాగా మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇంతకు ఈ పరీక్ష ఉంటుందా, రద్దు చేస్తారా ఉంటే కాపీయింగ్ చేసిన విద్యార్థులతో పోల్చితే మామూలు విద్యార్థుల గతి ఏంటి ఏళ్లుగా బుక్స్ తో కుస్తీ పడి చదివిన వారి భవిష్యత్ ఏంటి అన్న ప్రశ్నలు వెంటాడుతున్నాయి.
ఈ నెల 12న దేశ వ్యాప్తంగా నీట్-2021 పరీక్ష జరిగింది. ఆ తర్వాత ఈ పరీక్షపై ఎన్నోఎన్నో అనుమానాలు, అపవాదాలు తెరమీదకు వచ్చాయి. వాటికి బలం చేకూర్చుతూ రాజస్తాన్ రాష్ట్రం జైపూర్ లో స్కామ్ బాంబ్ పేలింది. అది కాస్త దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.నీట్ పరీక్ష మొదలైన అరగంటలోనే వాట్సాప్ ద్వారా లీక్ అయినట్టు గుర్తించారు. రాజస్తాన్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పరీక్ష కేంద్రం నుంచి నీట్ కోచింగ్ సెంటర్ ఓనర్ నవ రత్న స్వామి ఈ యవ్వారం నడిపినట్టు పోలీసుల విచారణలో తేలింది. అటు తర్వాత జరిపిన విచారణలో అభ్యర్థి ధేశ్వరియాదవ్తో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసుల విచారణలో పలు సంచలనాలు వెలుగు చూశాయి. ఒక్కో అభ్యర్థి నుంచి మెడికల్ మాఫియా 35 లక్షలతో డీల్ ఓకే చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనంతటికి మూల కేంద్రం నీట్ పరీక్ష కేంద్రం నుంచే జరిగినట్టు గుర్తించారు. ఎగ్జామ్ సెంటర్లోని ఇన్విజిలేటర్ ద్వారా క్వశ్చన్ పేపర్ ను ఫోటో తీసి వాట్సాప్ ద్వారా మెడికల్ మాఫియాకు పంపారు. అప్పటికే రెడీగా ఉన్న నిపుణులు క్వశ్చన్స్కు ఆన్సర్ ను గుర్తించి.. మళ్లీ ఆన్సర్ షీట్ ను పరీక్ష కేంద్రానికి పంపించారు. పరీక్ష ముగిసే సమయంలో ఆన్సర్ తో కూడుకున్న OMR షీట్ ను అభ్యర్థులకు ఇచ్చి పరీక్ష రాయించారని తేలింది.
ఇటు మహారాష్ట్రలోనూ ఇదే ఇష్యూ ప్రకంపనలు సృష్టిస్తోంది. రంగంలోకి దిగిన CBI కోచింట్ సెంటర్స్, విద్యార్థుల నిర్వాహకాన్ని రట్టు చేసింది. కొంత మందిపై కేసు కూడా నమోదు చేసింది. అసలు విద్యార్థుల స్థానంలో మరో విద్యార్థితో పరీక్ష రాయించినట్టు తేలింది. నీట్ పరీక్షలకు హాజరు కావాల్సిన అభ్యర్థికి బదులుగా మరొక తెలివైన మెడిసిన్ విద్యార్థి చేత పరీక్ష రాయించి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మెడిసిన్ సీటు ఇప్పించేలా ఆ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఆశావహులైన అభ్యర్థుల నుంచి ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నట్టు సీబీఐ దర్యాప్తులో తేలింది. కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పరిమళ్ కొత్పల్లివార్తో పాటు మోసపూరితంగా నీట్ పరీక్షలు రాసి మెడిసిన్ సీటు పొందాలని కుట్రపన్నిన పలువురు విద్యార్థులపై కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసినట్టు సీబీఐ అధికారి తెలిపారు.
కుంభకోణంలో భాగంగా తమను ఆశ్రయించిన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పరిమళ్ కొత్పల్లివార్ పోస్ట్ డేటెడ్ చెక్కులు తీసుకున్నట్టు తేలింది. ఒప్పందం ప్రకారమే పని పూర్తయ్యాక మిగతా బ్యాలెన్స్ చెల్లించేందుకుగానూ షూరిటీగా విద్యార్థుల టెన్త్, ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్లను కోచింగ్ సెంటర్ నిర్వాహకులు తీసుకున్నారని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్టు సమాచారం. నీట్ పరీక్షలు రాసే విద్యార్థుల పరీక్ష ఐడీ, పాస్వర్డ్ల వివరాలు సేకరించి ఎవ్వరికీ అనుమానం రాకుండా అభ్యర్థుల ఫొటోలు, వారి స్థానంలో పరీక్షలు రాసే నకిలీ అభ్యర్థుల ఫొటోలను మార్ఫింగ్ చేసి మరీ మోసాలకు పాల్పడుతున్నారు. స్పష్టమైన సమాచారంతోనే ఈ ముఠాను అరెస్ట్ చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత NTA సంస్థపై విద్యార్థుల్లో నమ్మకం పోయింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థను నాట్ ట్రూత్ వర్త్ ఏజెన్సీగా మారిందని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.