తెలుగు అకాడమీలో భారీ స్కామ్ .. మరో 8 కోట్లు , మొత్తం ఎన్ని కోట్లంటే
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీలో నిధుల గోల్మాల్ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. కార్వన్లో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో నకిలీ పత్రాలు సృష్టించిన కేటుగాళ్లు ఏకంగా రూ.43 కోట్లు కాజేశారు. యూబీఐలో తాము డిపాజిట్ చేసిన రూ.43 కోట్లు బ్యాంక్ లో లేవని అకాడమీ ప్రతినిధులు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తెలుగు అకాడమీలోని వ్యక్తులే వాటిని విత్ డ్రా చేసుకున్నారని యూబీఐ ఉన్నతాధికారులు సోమవారం పోలీసులకు వెల్లడించారు. ఇదిలా ఉంటే తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మరో ఫిర్యాదు అందింది. సంతోష్ నగర్ లోని యూనియన్ బ్యాంక్ నుంచి రూ.8 కోట్లు గోల్ మాల్ అయినట్టు తాజాగా ఫిర్యాదు చేసింది తెలుగు అకాడమీ, దీంతో ఇప్పటి వరకు తెలుగు అకాడమీలో గోల్ మాల్ అయిన నిధులు రూ.51 కోట్లకు చేరుకున్నాయి.
కార్వాన్, సంతోష్ నగర్ లోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ల నుంచి ఈ నిధులు మాయం అయినట్టు అధికారులు చెబుతున్నారు. బ్యాంక్ మేనేజర్ తో పాటు అకాడమీ అధికారుల హస్తం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే యూనియన్ బ్యాంక్ మేనేజర్ పై ఉన్నతాధికారులు చర్యలు కూడా తీసుకోగా, మరోవైపు ముగ్గురు సభ్యులతో కూడిన శాఖాపరమైన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, కాలేజీ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యాదగిరి, ఆ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. అక్టోబర్ 2వ తేదీలోగా ఈ కమిటీ విచారణ జరిపి ప్రాథమిక నివేదికను ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్టు తెలిపిన తెలుగు అకాడమీ డైరెక్టర్,. ఇప్పటికే తెలుగు అకాడమీ తరఫున సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని విచారణ కూడా ప్రారంభం అయినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్లోని హిమాయత్నగర్లో తెలుగు అకాడమీ దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్కు పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు తెలుగు అకాడమీలో ఉన్న రూ. 213 కోట్లలో ఆంధ్రప్రదేశ్ వాటా 125 కోట్లు ఇవ్వడానికి అధికారులు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలోనే తెలుగు అకాడమీకి చెందిన భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా వివిధ బ్యాంక్లతో పాటు యూబీఐ కార్వాన్, సంతోష్నగర్ శాఖల్లో రూ.43 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయని తేలింది. దీంతో గడువు తీరకముందే వాటిని విత్డ్రా చేయాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఈ నెల 21న డిపాజిట్ పత్రాలు బ్యాంకుకు చేరినా అటువైపు నుంచి సమాచారం రాకపోవడంతో 3 రోజుల తర్వాత తెలుగు అకాడమీ ఉద్యోగి రఫీక్ నేరుగా బ్యాంకుకు వెళ్లారు. అయితే రూ.43కోట్ల నిధులు ఆగస్టులోనే విత్డ్రా అయ్యాయని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో తెలుగు అకాడమీ అధికారులు అవాక్కయ్యారు. దీనిపై విచారణ చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మరో ఫిర్యాదు అందింది.. సంతోష్ నగర్ లోని యూనియన్ బ్యాంక్ నుంచి రూ.8 కోట్లు గోల్మాల్ అయినట్టు తాజాగా ఫిర్యాదు చేసింది తెలుగు అకాడమీ.
కార్వాన్, సంతోష్ నగర్ లోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ల నుంచి ఈ నిధులు మాయం అయినట్టు అధికారులు చెబుతున్నారు. బ్యాంక్ మేనేజర్ తో పాటు అకాడమీ అధికారుల హస్తం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే యూనియన్ బ్యాంక్ మేనేజర్ పై ఉన్నతాధికారులు చర్యలు కూడా తీసుకోగా, మరోవైపు ముగ్గురు సభ్యులతో కూడిన శాఖాపరమైన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, కాలేజీ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యాదగిరి, ఆ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. అక్టోబర్ 2వ తేదీలోగా ఈ కమిటీ విచారణ జరిపి ప్రాథమిక నివేదికను ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్టు తెలిపిన తెలుగు అకాడమీ డైరెక్టర్,. ఇప్పటికే తెలుగు అకాడమీ తరఫున సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని విచారణ కూడా ప్రారంభం అయినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్లోని హిమాయత్నగర్లో తెలుగు అకాడమీ దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్కు పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు తెలుగు అకాడమీలో ఉన్న రూ. 213 కోట్లలో ఆంధ్రప్రదేశ్ వాటా 125 కోట్లు ఇవ్వడానికి అధికారులు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలోనే తెలుగు అకాడమీకి చెందిన భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా వివిధ బ్యాంక్లతో పాటు యూబీఐ కార్వాన్, సంతోష్నగర్ శాఖల్లో రూ.43 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయని తేలింది. దీంతో గడువు తీరకముందే వాటిని విత్డ్రా చేయాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఈ నెల 21న డిపాజిట్ పత్రాలు బ్యాంకుకు చేరినా అటువైపు నుంచి సమాచారం రాకపోవడంతో 3 రోజుల తర్వాత తెలుగు అకాడమీ ఉద్యోగి రఫీక్ నేరుగా బ్యాంకుకు వెళ్లారు. అయితే రూ.43కోట్ల నిధులు ఆగస్టులోనే విత్డ్రా అయ్యాయని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో తెలుగు అకాడమీ అధికారులు అవాక్కయ్యారు. దీనిపై విచారణ చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మరో ఫిర్యాదు అందింది.. సంతోష్ నగర్ లోని యూనియన్ బ్యాంక్ నుంచి రూ.8 కోట్లు గోల్మాల్ అయినట్టు తాజాగా ఫిర్యాదు చేసింది తెలుగు అకాడమీ.