హిమాచల్ ప్రదేశ్ సీఎంకి కరోనా పాజిటివ్ !
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనే ముఖ్యమంత్రి, మంత్రుల సైతం కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే పలువురు సీఎంలు , ఎంపీలు, ఎమ్మెల్యేలు , మంత్రులు కరోనా పడ్డారు.తాజాగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ కి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది అని సోషల్ మీడియా ద్వారా స్వయంగా ఆయనే తెలియజేశారు. తనతో ఇటీవలి కాలంలో కాంటాక్ట్ లో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అయన హోం క్వారంటైన్ లోకి వెళ్తున్నట్టు ఈ నెల 5 న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు వెల్లడించారు. అంతకంటే రెండు రోజుల క్రితం మనాలీలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అయితే, సందర్భంగా ఆయనతో కలిసిన కొందరికి కరోనా పాజిటివ్ సోకిన్నట్టు తేలడంతో సీఎం క్వారంటైన్లోకి వెళ్లారని ఆయన తెలిపారు.క్వారంటైన్ సమయంలో సీఎం తన ఇంటివద్ద నుంచే విధులు నిర్వహించనున్నారు. కాగా, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ,
అయన హోం క్వారంటైన్ లోకి వెళ్తున్నట్టు ఈ నెల 5 న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు వెల్లడించారు. అంతకంటే రెండు రోజుల క్రితం మనాలీలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అయితే, సందర్భంగా ఆయనతో కలిసిన కొందరికి కరోనా పాజిటివ్ సోకిన్నట్టు తేలడంతో సీఎం క్వారంటైన్లోకి వెళ్లారని ఆయన తెలిపారు.క్వారంటైన్ సమయంలో సీఎం తన ఇంటివద్ద నుంచే విధులు నిర్వహించనున్నారు. కాగా, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ,