జ్యోతిష్యం తెలుసు.. చావును పసిగట్టలేకపోయిన హేమంత్

Update: 2020-09-28 08:50 GMT
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన హేమంత్ పరువు హత్యకు సంబంధించి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్.. పెయింటింగ్ కాంటాక్టుల్ని చేసే అతగాడు.. జ్యోతిష్యంలోనూ పట్టు ఉందట. ఇప్పటికే జ్యోతిష్యంలో సర్టిఫికేషన్ కోర్సు చేసినట్లుగా చెబుతున్నారు. జోతిష్యంలో తనకున్న పట్టుతో కొన్ని విషయంలో ఏం జరగనుందో ముందే ఊహిస్తుంటాడట.

అందులో భాగంగానే తన హత్య జరగటానికి ఒక రోజు ముందు.. అవంతి బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్పాడట. ‘‘మా ఇంటికి మా తరఫు బంధువులు వస్తాడని.. ముందు రోజే జోస్యం చెప్పాడు.. ఇలాంటివి అప్పుడప్పుడు చెబుతుంటాడు’’ అని అవంతి చెప్పారు. ఇంటికి వచ్చే బంధువులు తన మరణానికి కారణం అవుతారన్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోవటం గమనార్హం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అవంతి మేనమామకు.. వారింట్లో వారికి పదిహేనేళ్లుగా మాటలు లేవు. అవంతి పెళ్లి తర్వాత ఓదార్పు పేరుతో ఇంటికి వచ్చిన అతగాడు.. ఆమె తల్లిదండ్రులకు దగ్గరయ్యాడు. తన మాటలతో వారిని హత్య దిశగా ఆలోచనలు చేసినట్లుగా చెబుతున్నారు. పదిహేనేళ్లు దూరంగా ఉన్న మేనమామ తన తల్లిదండ్రులతో మాటలు కలుపుకొని ఇంతటి దారుణానికి ఒడిగడతాడని ఊహించలేదన్నారు. హేమంత్ ను చంపే వరకు తాను అన్నం ముట్టనని తన తల్లి ఒట్టు వేసినట్లుగా అవంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tags:    

Similar News