టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌ కు గాయం

Update: 2015-08-31 17:48 GMT
టీడీపీ ఎంపీ, ప్రిన్స్ మ‌హేష్‌ బాబు బావ గ‌ల్లా జ‌య‌దేవ్‌ కు ప్ర‌మాదంలో గాయాల‌య్యాయి. హైద‌రాబాద్‌ లో సోమ‌వారం సాయంత్రం ఆయ‌న బైక్‌ పై వెళుతుండ‌గా అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోయారు. దీంతో ఆయ‌న వెన్నులో ఓ ఎముక‌కు గాయం అయ్యింది. వెంట‌నే జ‌య‌దేవ్‌ ను హుటాహుటీన జూబ్లిహిల్స్‌ లోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

 జ‌య‌దేవ్ బైక్‌ పై నుంచి ప‌డిపోయిన విష‌యం తెలుసుకున్న ప‌లువురు టీడీపీ మంత్రులు, నాయ‌కులు ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్టు అపోలో వైద్యుల ప్రాథ‌మిక స‌మాచారం. దీనిపై పూర్తి వివ‌రాలు అందాల్సి ఉంది.
Tags:    

Similar News