వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

Update: 2017-04-22 08:12 GMT
తూర్పు గోదావరి జిల్లాలో ప్రతిపక్ష వైసీపీ రోజురోజుకూ బలపడుతోంది. టీడీపీ వేసిన ఎరకు చిక్కుకుని కొందరు నేతలు పార్టీని వీడినా ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతలు వస్తుండడంతో పార్టీకి మరింత పట్టు పెరుగుతోంది. తాజగా పి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరారు.
    
రెండుసార్లు గన్నవరం నుంచి ప్రాతినిథ్యం వహించిన పాముల రాజేశ్వరిదేవి వైసీపీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌లో జగన్ నివాసంలో అనుచరులతో కలిసి ఆమె పార్టీలో చేరారు. పలువురు స్థానిక కాంగ్రెస్‌ నేతలు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు.  ఈ ఉదయం తన అనుచరులతో కలసి హైదరాబాద్ కు వచ్చిన ఆమె, లోటస్ పాండ్ లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
    
జగన్ స్వయంగా ఆమెను పార్టీలోకి స్వాగతం పలికారు. రాజేశ్వరీ దేవి చేరికతో తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ మరింతగా బలపడుతుందని భావిస్తున్నట్టు ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు. పి.గన్నవరం, పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే వైసీపీకి మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో మంచి క్యాడర్ ఉన్న మహిళా నేత రాజేశ్వరి దేవి చేరికతో వైసీపికి లాభం కలగనుందని టీడీపీ నేతలు కూడా కంగారు పడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News