కుక్క కోసం ఇద్దరి కొట్లాట.. డీఎన్​ఏ పరీక్ష చేయించిన పోలీసులు !

Update: 2020-11-23 06:30 GMT
ఓ కుక్క కోసం ఇద్దరు వ్యక్తులు కొట్లాటకు దిగారు. నాదంటే నాది అంటూ పోలీసుల ఎదుట తగువు పెట్టుకున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక పోలీసులు కుక్కకు డీఎన్​ఏ పరీక్షలు చేయించారు. ఆ ఫలితాలు వస్తే కానీ ఆ కుక్కకు యజమాని ఎవరు అన్న విషయంపై క్లారిటీ వచ్చేలా లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే..  మధ్యప్రదేశ్​ రాష్ట్రం హోషంగాబాద్‌ కు చెందిన షాదాబ్​ ఖాన్​ ఓ పత్రికలో జర్నలిస్ట్​కు పనిచేస్తున్నాడు.

అయితే అతడు లాబ్రడార్ జాతికి చెందిన ఓ కుక్కను తెచ్చుకొని దానికి ‘కూకూ’ అనే పేరుపెట్టి పెంచుకున్నాడు. ఇటీవల ఆ కుక్క తప్పిపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అయితే అదే పట్టణంలో ఉంటున్న ఏబీవీపీ నాయకుడు కార్తీక్ శివ్‌హరే దగ్గర తన కుక్క కనిపించింది. దీంతో షాదాబ్​ఖాన్​ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కార్తీక్​ అనే వ్యక్తి దగ్గర తన కుక్క ఉందని చెప్పాడు. అతడు దాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. దీంతో పోలీసులు కార్తీక్​ విశ్​హరేను పిలిపించారు.

శివహర్​ మాత్రం ఆ కుక్క తనదేనని చెబుతున్నాడు. పైగా దానిపేరు ‘కుకూ’ కాదని టైగర్​ అని చెప్పాడు. పోలీసులు ఇద్దరి సమక్షంలోకి ఆ కుక్కను తీసుకొచ్చారు. ఆ కుక్క ‘కూకూ’ అని పిలవగానే షాదాబ్​ దగ్గరకు వెళ్లింది.  ‘టైగర్’ అని పిలవగానే కార్తీక్​ దగ్గరకు వచ్చింది. దీంతో ఏం చేయాలో పోలీసులకు అర్థం కాలేదు. అయితే ​2017లో పంచ‌మ‌ర్హి నుంచి ఈ కుక్కను తెచ్చుకున్నానని కావాలంటే డీఎన్ఏ ప‌రీక్ష చేయాలని షాదాబ్​ పోలీసులను కోరాడు. పోలీసులు శ‌నివారం కుక్క డీఎన్ఏ శాంపిల్స్ సేకరించి టెస్ట్ కు పంపించారు. పరీక్ష ఫలితాలు వస్తే ఈ కుక్క ఎవరిదనే విషయం నిర్ధారణ అవుతుంది.
Tags:    

Similar News