బ్రేకింగ్: కాంగ్రెస్ కు షాక్.. బీజేపీలో దామోదర.?

Update: 2019-08-23 11:22 GMT
గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా అంథోల్ నియోజకవర్గంలో ఓడినప్పటి నుంచి ముభావంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ డిప్యూటీ సీఎం.. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారని తాజా సమాచారం. ఆయన బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది.

ఇవాళ రాత్రి హైదరాబాద్ వస్తున్న అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి చేరడానికి కాంగ్రెస్ నేత దామోదర రెడీ అయ్యారని సమాచారం. ఈ మేరకు ఆయన మెదక్ జిల్లాలో తన అనుచరులు, కార్యకర్తలు ముఖ్యనేతలతో శుక్రవారం సమావేశమవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

2009లో కాంగ్రెస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో దామోదర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఆయన భార్య 2014 ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి తిరిగి ఈయన ఒత్తిడితో కాంగ్రెస్ లోకి వచ్చింది. అప్పుడే బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో ఓడాక కాంగ్రెస్ కు పూర్తి దూరంగా జరిగిన దామోదర ఇప్పుడు బీజేపీ గూటికి చేరుతుండడం కాంగ్రెస్ కు బిగ్ షాక్ లా మారిందంటున్నారు.
    

Tags:    

Similar News